Monday, November 14, 2011

వుత్సవాలు.....3



......వైభవంగా

.......జరుగుతున్నాయి--రాష్ట్రమంతటా. 

మా చిన్నతనంలో, మా మేష్టార్లు చెప్పేవారు--"జాతీయ దుబారా" (నేషనల్ వేస్ట్); "నేరమయ దుబారా" (క్రిమినల్ వేస్ట్)--ల గురించి. 

పగటిపూట ఎలెక్ ట్రిక్ లైటు వెలిగించినా, యెవరూ లేనిచోట ఫాన్ తిరుగుతున్నా--అవి "అలాంటి వేస్ట్"లు అని.

మనం ప్లగ్ పాయింట్ల స్విచ్చులు కట్టేసినా, టీవీలూ వగైరా "స్టాండ్ బై"లో పెట్టినా, యెంతో కొంత కరెంటు "కాలుతుంది" అనీ, వుత్తమ విధానం ఆ ప్లగ్ పిన్స్ ని తొలగించడమేననీ శాస్త్రఙ్ఞులు చెపుతున్నారు. 

మన ఎస్పీ బాలు కూడా చెపుతున్నాడు!

మనందరం ఇంత "జాగ్రత్తగా" కరెంటు వాడుకుంటూంటే.......

అనేక "గుళ్ల"లో, "దేవాలయాల"లో, "పందిళ్ల"లో, ఇవేకాకుండా పర్యాటక స్థలాల్లో, పుట్టినరోజు, సమర్త లాంటి ప్రైవేటు ఫంక్షన్లలో--ఇలా ప్రతీ చోటా "సీరియల్ లైట్లు" దండలు దండలుగా వెలిగించడం, పేపర్లలో "వైభవంగా...." అంటూ వార్తలు రావడం (వ్రాయించుకోవడం) లాంటివి జరుగుతున్నాయి.....ప్రతీరోజూ చూస్తున్నాం.

మరి, వీటన్నింటికీ అయ్యే "కరెంటు ఖర్చు" యెవరిస్తున్నారు? యెవరిచ్చినా, అదంత అవసరమా? 

కరెంటు దీపాల్లేనిరోజుల్లో, గుళ్లెక్కడున్నాయో ప్రజలకి తెలియదా? వాళ్లు పూజలూ, వ్రతాలూ, అభిషేకాలూ చేసుకోలేదా? 

ఇదంతా యెవడబ్బ సొమ్ము?

భక్తి పేరుతో, ఆ "లైటింగు"వాళ్లు బాగుపడడానికి (వృధ్ధిరేటులో వాళ్లూ భాగమేకదా!), "జాతీయ దుబారా" కోసం, కాక ఇవేమిటి? (వాళ్లూ బ్రతకాలిగా?!).

అందుకే.......భక్తి వ్యాపారులూ జిందాబాద్!

Sunday, November 13, 2011

వుత్సవాలు.....2




......వైభవంగా

.......జరుగుతున్నాయి-- రాష్ట్రమంతటా. 

కొన్ని కొత్త కొత్త వుత్సవాలూ, పూజలూ, నోములూ వగైరాలగురించి మొదటిసారి వింటున్నాము.

వాటిలో ఒకటి--వివాహమైన మొదటియేడాది వచ్చే కార్తీక పౌర్ణమికి--11అరటిపళ్లున్న హస్తాన్ని, బూడిదగుమ్మడి పువ్వు, పిందె, సూరే గుమ్మడి కాయ, పసుపు మొక్క, కంద మొక్క, చెట్టునుంచి చేతితో (క్రిందపడకుండా) అందుకున్న కొబ్బరికాయల గెల--శివాలయంలో నైవేద్యంగా నివేదిస్తే శుభాలు సమకూరతాయని--"పదకొండు కాయలున్న అరటిపళ్ల హస్తానికి" గిరాకీ పెరిగి, ఒక్కోటీ రూ.150/- కి అమ్మారట!

వేదమంత్రోశ్చ/శ్చారణ అని వ్రాస్తున్నారు! అది వుచ్చారణ అని వ్రాయాలి. పునశ్చరణ అన్నట్టు కాదు. 

మనకి అర్చకులూ, పూజారులూ, పండితులూ తెలుసు. కానీ ఈ మధ్య కొత్తరకం పండితులు పుట్టుకొచ్చారు--వేదపండితులు, దీపాలంకరణ సేవా పండితులు, అభిషేక పండితులు....ఇలా! 

వేదాలు చదవడానికీ, ఆశీర్వచన పనసలు చెప్పడానికీ వేదాల్లో పాండిత్యం అఖ్ఖర్లేదు. అయినా, వాళ్లకి ఇంకో మాటలేక, వేదపండితులు అని వ్యవహారంలోకి వచ్చింది. సరే. మరి అభిషేక పండితులూ, దీపాలంకరణ పండితులూ యెవరు? పేపర్లవాళ్లు ఇస్తున్నారా ఆ బిరుదులు? ఇంకెవరైనా అలా వ్రాయిస్తున్నారా?

దీపాలంకరణ అంటే గుర్తొచ్చింది. ఇదివరకు గృహస్థులు ప్రతీరోజూ దీపారాధన చేశాక మాత్రమే భోజనం చేసేవారు. అలా సంవత్సరంలో యే కొన్ని రోజులైనా, యే అస్వస్థత లేదా ఇతరకారణాలవల్లనో దీపం పెట్టలేకపోయి వుంటే, దానికి ప్రత్యామ్నాయంగా కార్తీక పూర్ణిమరోజున శివాలయంలో "ఒక దీపం" వెలిగిస్తే సరిపోతుందనేవారు. 

ఇప్పుడు యెవరూ ప్రతీరోజూ దీపాలు వెలిగించడంలేదు కాబట్టి, "పండితులు" ఆ రోజున 365 దీపాలు వెలిగించమంటున్నారట! బాగుంది. మరి "సహస్ర" దీపాలమాటేమిటి? అలా అందరూ యెగబడి ఒక్కోళ్లూ 365 చొప్పున పెట్టుకొంటూ పోతే, సహస్ర యేమి ఖర్మ.....లక్షల్లో పెట్టినా చాలవు!

పైగా, ఇది వరకు కిరాణా షాపుల్లో నూనెలు తూచడానికి ఓ పళ్లెం లంటిది కాటాలో పెట్టుకొని, అందులో మన సీసానో, డబ్బానో వుంచి, పడికట్టి, వాళ్ల డొక్కులతో నూనె పోసేవారు. ఆ సమయంలో కొంతనూనె ఆ ట్రేలో పడేది. కొట్టు కట్టేసేప్పుడు ఆ ట్రేలో పడిన అన్నిరకాల నూనెల మిశ్రమాన్ని వేరే డబ్బాలోపోసి, నిల్వ చేసేవారు. దాన్ని దీపావళికి "దీపాల నూనె" పేరుతో చవగ్గా ఇచ్చేవారు. 

ప్రమిదలో దీపం పెట్టాలంటే ఆముదం వుపయోగించాలి. ఆ పొగ, కళ్లకి మంచిది. వాసన కూడా ఆరోగ్యం. మిగిలిన యే నూనె అయినా, కళ్లు మండుతాయి. పొల్యూషన్ పెరుగుతుంది!

ఇంకా, మనదేశం వార్షిక వంటనూనెల దిగుమతి బిల్లు కొన్ని వందలకోట్ల లో వుంటోంది! నూనెలని దుబారా చేస్తే పుణ్యం వచ్చేస్తుందా?

ప్రమాదాల సంగతి సరేసరి. మొన్న మావూళ్లో ఓ గుళ్లో, సహస్ర దీపాలకోసం ప్రమిదల్లో నూనెపోస్తూంటే, అక్కడే ఆడుకొంటున్నపిల్లలు పొరపాటున నూనె వంపేశారు. మైకులో "నూనె వలికింది....జాగ్రత్త" అని హెచ్చరిక చేస్తున్నా, ఒకావిడయెవరో జర్రున జారి, ప్రక్కామెమీద పడడం, పేకమేడలో పేకల్లా ఒకళ్లమీద వొకళ్లు పడిపోయడం జరిగిపోయాయి. అదృష్టవశాత్తు పెద్ద దెబ్బలూ, ఫ్రాక్చర్లూ జరగలేదెవరికీ!

టీవీలో విశాఖపట్నంలో అనుకుంటా ఒకావిడ చీర అంటుకోవడం, ఆవిడ కెవ్వు కెవ్వుమని అరుస్తూ వుండడం, చుట్టుప్రక్కల ఆడవాళ్లు దూరంగా పారిపోతూంటే, కొందరు చీర విప్పెయ్యమనీ, కొందరు క్రిందపడి దొర్లమనీ సలహాలిస్తూండడం చూశాము!

ఇవన్నీ అంత అవసరమా?


Saturday, November 12, 2011

అధిష్టాన తె'లంగా'నం



విస్తృత సంప్రదింపులు

మనదేశంలో కాంగీవాళ్లూ, మీడియా వాళ్లూ 'ఓ ప్రత్యేకజాతిగా' గుర్తించినవాళ్ల (ప్రపంచ వ్యాప్తంగా వున్న ఓ మతానికి సంబంధించిన.....కాదు!) పండుగ తరవాత, ఓ నిర్ణయం వస్తుంది అని వూదరగొట్టారు--బొచ్చె లాంటివాళ్లు. 

గులాం నబీయేమో, తాంబూలాలు ఇచ్చేశాను....కోర్ కమిటీవాళ్లే తన్నుకు చస్తారు--అనేశాడు. 

మధ్యలో మాయ వేసిన బ్రేకు లో పడి, "రెండో ఎస్సార్సీ" అన్నారొకడో, ఇద్దరో! 

"ఆమాటన్నవాడి నాలుక చీరేస్తాం. గొంతుక కోసేస్తాం" అనలేదు బక్కన్న. 

ఇంతకీ, రోకలి తన పన్నుతోసహా నానిందా? 

అప్పుడేనా! 

ఇవాళ మన నీలం పాగా గడ్డపోడు "విస్తృత సంప్రదింపులు జరుగుతున్నాయి, ఆ పనిమీదే వున్నాం" అన్నాడు. 

మాయమ్మేమో, "నా రాజ్యానికివచ్చినప్పుడే నీ నోరులేస్తోందేమి బిడ్డా? ఢిల్లీ లో నీతల్లికి సమ్‌ఝాయించు బే!" అని గర్జించింది. 

గజం మిధ్య, పలాయనం మిధ్య!   

Wednesday, November 9, 2011

వుత్సవాలు.....



......వైభవంగా

మన పండగల సంఖ్య పెరిగిపోతోంది. 

కార్తీక మాసంలో ప్రతీరోజూ "అతి పవిత్రమైనదే"నట. 

ఇంక "మాసములలో నేను మార్గశిరమును" అన్నాట్టెవడో! అందుకని, మార్గశిరమాసంలో "అన్నీ" పవిత్ర దినాలేనట. 

మరి పుష్య మాసంలో, ధాన్య్హ లక్ష్మి ఇంటికి వస్తుంది కాబట్టి, అన్నీ పవిత్ర దినాలే. పశుపూజలతో సహా, ఆయుధ పూజలతో సహా! బాగుంది. 

రాబోయే రోజుల్లో, అన్ని మాసాల్లోనూ, అన్ని రోజులూ, వివిధ కులాలవాళ్లకీ, మతాలవాళ్లకీ "పవిత్రమైనవే" అవుతాయి. యెటొచ్చీ, ఆ పవిత్రతకి అర్థాలు మరిపోతాయి. అంతే. 

నేను పుట్టి బుధ్ధెరిగాక, గత యాభై యేళ్లలోనూ వినని......అంతెందుకూ......గత సంవత్సరం కూడా వినని....కొన్ని క్రొత్త క్రొత్త కథనాలు వింటున్నాము! 

దీపావళీ, నరక చతుర్దశీ మన చిన్నప్పణ్నించీ వింటున్నవే. 

వుత్తరదేశ వ్యాపారుల పుణ్యమాని, "ధన్ తేరాస్" (ధన త్రయోదశి) పుట్టుకొచ్చింది. ఓకే! 

ఓ ప్రబుధ్ధుడు దానికి యెక్కడనుంచి  క్రొత్తగా "లింకు" పెట్టుకొచ్చాడో చూడండి! "ధన్" అంటే  "ధన్వంతరి"ట. ఆయన పుట్టినరోజట అది. సరే. 

ఆయన "వైద్యం"లో యెన్నెన్నో ప్రయోగాలు చేసి, 'కొత్త కొత్త మందులు కనిపెట్టాడట, కట్టాడట '. బాగుంది. 

వాటిల్లో "సువర్ణ భస్మం" ఒకటిట. అందుకని, ఆ రోజున అందరూ యెంతో కొంత "స్వర్ణాన్ని" కొనాలట! 

(ఇంకా నయం.....వెంటనే దాన్ని భస్మం చెయ్యాలని ఇప్పటివరకూ చెప్పలేదు. ముందు ముందు అదీ చెప్తారేమో.....మూఢ జనులు ఆపనీ చేసి, మళ్లీ మళ్లీ బంగారం కొంటూనే వుంటారేమో! వాళ్ల వ్యాపారాలు ఇంకా వృద్ధి చెందుతాయేమో!) 

ఇంతకు ముందు "విష్ణుచిత్తుడికి ఓ పాప దొరికితే, ఆమెకి 'సూడి కుడుత్త నాచ్చియార్ ' అని పేరు పెట్టుకున్నాడు" అని రాసిన పెద్దమనిషే......ఈ కథనం కూడా వ్రాసింది! బాగానే వుంది. తెలుగు పాఠకులు వీపీలు (వట్టి పిచ్చాళ్లు)! 

ఇంకో క్రొత్త కథనం పుట్టుకొచ్చింది....నరకాసురుడు భూమి పుత్రుడు కాబట్టి, "దళితు"డట. వాణ్ని "ఆర్యులు" ఓ విలన్‌గా చిత్రీకరించి, కృష్ణుడి విజయంగా (ఆయన బీసీ!) ఈ పండగని ప్రవేశపెట్టారట! అందుకని, ద్రవిడుడైన నరకుణ్ని దేవుడిగా పూజిస్తారట! 

(ఇది వ్రాసిన మేతావులు కమ్మీనిస్టులని కొంతమంది చెవులు కొరుక్కొంటున్నారు....నిజానిజాలు పైవాడికే తెలియాలి!). 

ఓ యాభై యేళ్ల క్రితమే, తమిళనాడు (ద్రావిడ ప్రదేశ్ అంటే వొప్పుకొంటారా?) లో "పెరియార్ రామస్వామి నాయకర్" అనే పెద్దాయన, "ఆర్యులకి" వ్యతిరేకంగా పెద్ద వుద్యమాన్ని నిర్వహించాడు. ఆ చెట్టు కొమ్మలే నేటి ద్రావిడ పార్టీలు.....ద్రవిడ కజగం; ద్రవిడ మున్నేట్ర; అన్నా ద్రవిడ....ఇలా! 

ఇంతకీ ఆయన చేసిందేమిటి? అంత గులగావుంటే, రావణుణ్ని పూజించుకోవచ్చుకదా? వూఁహూఁ! రాముణ్ని చెప్పులదండలేసి, పెంట విసురుతూ, చెప్పులతో కొడుతూ, "వూరేగించాడు"! 

చూస్తూంటే ఇలాంటి "వుద్యమాలు" తెలుగునాడు లో కూడా విజృంభిస్తాయేమో! 

నందో రాజా భవిష్యతి కదా?

......మరోసారి.

మన దేవుళ్లు



అంటూ.....సొంటూ

మన పెద్దలు విధిగా పాటించేవారు వీటిని. 

"పచనం" చేసిన యే పదార్థమైనా....అంటే "వండబడిన"......(వుడకబెట్టినా, వేయించినా, నానబెట్టినా....ఇలా) పదార్థాలు, తినుబండారాలు యేవైనా "అంటు". ఈ పదంతోనే "అంట్లు తోముకొనైనా బతకొచ్చు" లాంటి నానుడులు పుట్టాయి. 

ఇంతకీ అంటు అంటే యేమిటి? ఆ పదార్థాన్నిగానీ, అవి వండబడిన పాత్రని గానీ "చేత్తో" ముట్టుకోకుండా వుంటే మంచిది. ఒకవేళ ముట్టుకున్నా, వెంటనే చెయ్యి కడుక్కోవాలి! కారణం? 

సైన్స్ చెపుతోంది.....పచనం చెయ్యబడ్డ యే పదార్థమైనా, మామూలు "రూమ్ టెంపరేచరు" కి వేడి తగ్గగానే, "సూక్ష్మ జీవులు" విజృంభిస్తాయి. ఆ పదార్థాలమీద "కాలనీలకి కాలనీలు" నిర్మించుకొని, వాటిపని అవి చేసుకుపోతాయి (ఆ పని.....ఆ పదార్థాన్ని 'శిథిలం ' చెయ్యడం!). ఆ క్రమంలో మనం  పదార్థాని/పాత్రని ముట్టుకుంటే, మనచేతికి ఆ సూక్ష్మజీవులు అంటుకొని, మళ్లీ కాలనీలు నిర్మించడం ప్రారంభిస్తాయి! దానివల్ల మన ఆరోగ్యానికి హాని జరగొచ్చు. 

ఈ మధ్య మా స్నేహితుడొకడు నలభై యేళ్ల తరవాత కలిశాడు. హైదరాబాదులో, ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో 2096 ఫ్లాట్లు వున్నదాంట్లో, ఓ బ్లాకులో, 19వ అంతస్థులో ఫ్లాట్ కొనుక్కొని, దాంట్లో నివశిస్తున్నాడట.....హాయిగా! 

మనమే అన్నన్ని నివాసాలు కట్టించుకోగలుగుతున్నాము. 

చీమలు, తమ అపార్ట్మెంట్ బ్లాకుల్లొ (పుట్టల్లో), కొన్ని వేల కాలనీలనీ, కొన్ని లక్షల "అపార్ట్మెంట్ బ్లాకులనీ/బిల్డింగులనీ", కొన్ని కోట్ల నివాసాల్నీ యేర్పాటు చేసుకొంటాయి. 

మరి సూక్ష్మజీవులు? కొన్ని లక్షల కాలనీల్లో, కొన్ని కోట్ల బ్లాకుల్లో, కొన్ని శతకోట్ల నివాసాలు యేర్పరచుకొంటాయి! అందుకు వాటికి పట్టే సమయం, కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే! 

ప్రకృతిలో మనకి ప్రసాదింపబడ్డ అనేక ఓషధులూ, రసాయనాలూ వగైరాలు అత్యంత శక్తివంతమైనవి, ప్రభావశీలమైనవి. 

తెల్లటి "పాలరాయి" మధ్యలో నల్లటి చారలూ, వలయాలూ యేర్పడ్డానికి కారణం అవే. 

నీటికి వున్న శక్తి యేమిటి? కొండల్లోని పెద్ద పెద్ద రాళ్లని కరిగించుకొంటూ వస్తూ, చిన్న చిన్న రాళ్లని దొర్లిస్తూ, వాటిని గులకరాళ్లుగా, గరుకు ఇసుకగా, మెత్తటి ఇసుకగా, సిలికాన్ వగైరాలున్న సూక్ష్మ ఇసుకరేణువులుగా మారుస్తుంది కదా?  

మరి, తెల్లని పాలరాయితో చెక్కిన దేవుళ్ల విగ్రహాలు కొన్నాళ్ల తరవాత, ప్రతీరోజూ "నీళ్లతో" అభిషేకాలు చేస్తున్నా, నల్లటి మచ్చలు యేర్పరచుకుంటూండడానికి కారణం యేమిటి? 

మరదే! 

ఈ సోదంతా యెందుకు......అసలు యేం చెప్పదలచుకున్నావు? ..... అనడుగుతారా ..... వస్తున్నా ..... అక్కడికే వస్తున్నా! 

మొన్నోరోజు మా జిల్లాలో ఓ "ఆలయం"లో......51 కిలోల బియ్యంతో వండిన పెరుగన్నంతో ఈశ్వరుడికి అభిషేకం చేశారట! (అభిషేకం చేసి వూరుకున్నారా? లింగం అంతా పెరుగన్నం మెత్తి, చంద్రవంకా, త్రిశూలం, మొహమ్మ్మీద బొట్టూ, జటాజూటం, గంగా వగైరాలని కూడా ఆ పెరుగన్నంతొనే టిర్చిదిద్ది, పేపర్లో ఫోటో వేయించుకున్నారు!) 

అరసవిల్లిలో, తెప్పోత్సవంలో, "......లూ, అరటిపళ్లూ విసురుతూ" భక్తులు అత్యుత్సాహంగా......"తరించారు"ట! 

(మావూరి చుట్టుప్రక్కల, అలా రథమ్మీదకి కొబ్బరిచిప్పలు విసరగా, అవి కణతకి తగిలి మరణించిన అర్చకుల దాఖలాలున్నాయి. 

ఓ నదిమీద రైలు వెళుతుంటే, కిటికీల్లోంచి డబ్బులు (కాయిన్లు) విసిరేసి, దణ్నం పెట్తుకుంటున్నారంటే, దానివల్ల యెవరికీ హానిలేదు.....ఒళ్లు కొవ్వెక్కి, వాళ్ల డబ్బులు నదిలో పారవేస్తున్నారు....అనుకోవచ్చు. మరి ఆహార పదార్థాలమాటో?) 

ఇంతకీ నే చెప్పొచ్చేదేమిటండయ్యా అంటే, "మూఢ భక్తులారా! తెలివి తెచ్చుకోండి! మూర్ఖ పూజారులారా! ఇలాంటివి ప్రోత్సహించడం మానండి! దేవుళ్లని "అంట్ల" పాలు చెయ్యకండి! 

వింటారా? 

Wednesday, November 2, 2011

ప్రశాంతి.......ప్లెబిసైట్



కాశ్మీర్ వ్యవహారం

"కాశ్మీర్ సమస్యకి పరిష్కారం అక్కడ 'ప్లెబిసైట్' నిర్వహించడమే" అన్నాట్ట ప్రశాంతి భూషణ్! (నిజంగా అవే మాటలన్నాడోలేదో నాకు తెలీదు). 

అందుకని, సుప్రీం కోర్టులో ఆయన కార్యాలయంలో ఆయనని క్రిందపడేసి, తొక్కేసి, చొక్కా అవీ చింపేసి, నానా హంగామా చేశారట కొందరు "దేశ భక్తులు"! బాగుంది. 

వివిధ ప్రముఖ పత్రికల్లో అనేకుల వ్యాసాలూ, ఖండన మండనలూ, "యెట్టి పరిస్థితుల్లోనూ దానికి వొప్పుకోం!" అనే హెచ్చరికలూ....."రాచకీయ రక్తులకి" పండగే పండగ! 

అందులోనూ ఆయన "అన్నా బృందం" వాడాయే! ఇంకేమి కావాలి? 

అంతేగానీ, ఆయన ఆ మాట అని వుంటే, "దాని పొడుగెంత, యెలడుపెంత, దాన్సిగతరగ! లోతెంత?" అని యే (అ)వివేకి అయినా మాట్లాడాడా? వూహూ! 

చరిత్రలోకి వెళితే, స్వాతంత్ర్యం వచ్చాక, పాకిస్థాన్ కాశ్మీరు ఆక్రమణకి భారత్ మీద యుధ్ధం ప్రారంభిస్తే, కొంత భాగాన్ని "ఆక్రమిస్తే", జనరల్ కరియప్ప "మూడో నాటికల్లా వాళ్లని తరిమేసి, మన భూభాగం స్వాధీనం చేసుకొంటాం" అని హామీ ఇచ్చినా, నెహ్రూ "వద్దు! వద్దు! మనం శాంతి కాముకులం" అంటూ, అప్పటికి క్రొత్తగా సమర్తాడిన ఐక్యరాజ్య సమితి మోజులో, సమస్యని అక్కడ దాఖలు చేస్తే, ఆ సమితి యేమని తీర్మానం చేసింది? "కాశ్మీర్లో ప్లెబిసైట్ నిర్వహించాలి. తీర్పు యెలావస్తే అలా రెండు దేశాలూ అమలు చేయాలి" అని! 

కానీ మన దేశంలో "సెంటిమెంటల్ ఫూల్స్" అరవ "సియార్" (హిందీలో గుంటనక్క!) అనబడే రాజగోపాలాచార్యులు లాంటివాళ్లు దానికి అడ్డుపడ్డారు. భారత్ 'వెనుకంజ" వేసింది. అక్కడితో మొదలు రావణ కాష్టం. 

తరువాతకూడా, చైనా "ఆక్సాయ్ చిన్" ఆక్రమిస్తే, నెహ్రూ "అక్కడ గడ్డిపరక కూడా మొలవదు.....దానికోసం మనకి అంత అవసరమా?" అంటే, ఆ సియారే "నీ బట్టతలమీదకూడా యేమీ మొలవదు కాబట్టి అది కూడా......?" అని వెక్కిరించాడు. దాంతో మరో రావణ కాష్టం!

ఇందిరాగాంధీ సైతం, 1965లోనూ, 1971లోనూ, ఆ తరవాతా, మన సైన్యం యుధ్ధాల్లో గెలుచుకున్న అపారమైన పాకిస్థాన్ భూభాగాలని యే షరతులూ లేకుండా తిరిగి వారికి అప్పగించేసిందేగానీ, వాళ్లతో బేరం పెట్టలేకపోయింది! మన మిగ్ (MIG) విమానాలతో అమెరికన్ నాట్ (GNAT) విమానాలని ఈగల్లా నలిపేసిన మన సైనికులూ, స్క్వాడ్రన్ లీడర్ "ట్రెవర్ కీలర్" లాంటివాళ్ల త్యాగాలని అర్థంలేనివిగా చేసేసింది! 

నిన్నో మొన్నో, మన్మోహన్ బంగ్లాదేశ్ తో యేదో వొప్పందం చేసుకొని, భారతీయులు, భారత పౌరులు కానివారు వుంటున్న దీవులని, తీసేసుకొని, బంగ్లా పౌరులు, అక్కడ పౌరసత్వం లేనివాళ్లు వుంటున్న దీవులని వాళ్లకి ఇచ్చేశాడు. ఇదెంత బాగుంది? (అక్కడక్కడా తింగరాళ్లు యెవరో విమర్శలు చేసినా, దేశం మొత్తమ్మీద యెవరూ వ్యతిరేకించలేదు దీన్ని!) 

మరి, అలాంటి సూత్రాన్నే కాశ్మీర్ సమస్యకీ, చైనా సమస్యకీ వర్తింపచేస్తే, తప్పేముంటుంది? ప్రశాంతి అన్నదాంట్లో తప్పేముంది? 

మాజీ ఐయేయెస్, లోక్ సత్తా అధినేత సైతం, కాశ్మీర్లో "రిఫరెండం" అంటాడు! ప్లెబిసైట్ కీ, రిఫరెండం కీ తేడా తెలీదు అనుకోవాలా? 

ఇలాంటివి అన్నీ "ప్రజాభిప్రాయ సేకరణలే" అయినా, దేశాల మధ్యా, దేశంలోనూ, ప్రాంతాల మధ్యా.....ఇలా అన్నింటికీ వేరే వేరే మాటలున్నాయి. 

ఈ కాంగీలని తెలంగాణా గురించి రాష్ట్రం మొత్తమ్మీద "రిఫరెండం" నిర్వహించమనండి! అబ్బే! అలా చేస్తే సమస్య అంతరించిపోదూ! సమస్య అంతరిస్తే, మన పార్టీ, మన నాయకులూ, మన అధిష్టానాలూ, మన గుత్తేదార్లూ, మన వృధ్ధి రేటూ, మన .......అవీ ఇవీ అన్నీ.....యేమయిపోవాలి? 

అందుకే, ప్రశాంతి ని తన్నుదాం, కేజ్రీవాల్ ని కేసుల్లో ఇరికించేద్దాం, కిరణ్ బేడీని తీహార్ జైలుకి పంపిద్దాం......చివరికి అన్నా మౌన దీక్ష భగ్నం అయ్యేవరకూ వాళ్ల సంఘ సభ్యులందర్నీ యేదేదో చేసేద్దాం! 

"భలే మామా, భలే! అదే మన తక్షణ కర్తవ్యం!"