Thursday, January 31, 2013

అజ్ఞానులూ...........



..........సుజ్ఞానులూ

ఆమధ్య మన నికమ్మా జగన్మోహన్ గారు "ఎఫ్ డీ ఐ ల్లో విదేశీ పెట్టుబడులని అజ్ఞానులు మాత్రమే విమర్శిస్తున్నారు" అంటూ సెటైర్ వేశారు.

మొన్నేమో, హైటెక్ బాగ్లివలియా "డీజెల్ ధరలు అలా పెంచుతూ వుండడమే మంచిది. దానివల్ల జనాలు డబ్బులన్నీ దానికే ఖర్చు చెయ్యడంవల్ల, మిగిలిన ఖర్చులకి డబ్బుల్లేక, ద్రవ్యోల్బణం దిగి వస్తుంది" అన్నాడు.

తరవాత, నషీలా భిండే "నెల అంటే 30 రోజులు కాదు, వారం అంటే 7 రోజులు కాదు, రోజు అంటే 24 గంటలు కాదు" అంటూ కాల మానాన్ని పునర్నిర్వచించారు.

ఇంకో బాకో గారు, "........ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితం యెప్పుడొస్తుందో మాత్రం చెప్పలేను!" అన్నాడు. (ఇదివరకు పిచ్చిదంబరం ఇలాగే ".....ప్రక్రియ మొదలుపెడుతున్నాం....." అని చెప్పి తన కొంపమీదికీ, ఇతర కొంపలమీదికీ ఒకేసారి తెచ్చాడు.)

పిల్లకాకి సాహుల్ "అధికారాన్ని విషంగా భావించింది మా అమ్మ. అలాకాకుండా అధికారాన్ని ఆస్వాదిస్తూ దాన్ని విషంగా భావించాలి" అనో ఇంకేదో, మన జానారెడ్డికన్నా అయోమయం కలిగించేట్టు మాట్లాడాడు.

ఇవన్నీ చూస్తుంటే, "ఆహా! మన కేంద్రంలో వున్నవాళ్లందరూ యెంత 'సుజ్ఞానులో కదా', వాళ్లు యెక్కడ చదువుకున్నారో చెపితే మనవాళ్లనికూడా అక్కడ చదివిద్దుం కదా!"  అనుకుంటాము మనం.

వీళ్లందరూ ఈ యేడాదిలోనో, మళ్లీ యేడో మళ్లీ వచ్చి మన వోట్లు అడుగుతారట! (అన్నట్టు యేడాది అంటే 12 నెలలే కానఖ్ఖరలేదు కదా? కొన్ని నెలలయినా కావచ్చు, కొన్ని సంవత్సరాలైనా కావచ్చు.)

మరి జాగ్రత్త సుమా!