Wednesday, October 20, 2010

మన రైళ్లూ.........

"మన..........'ఖ భక్తీ"

మన రైళ్లలో రిజర్వేషన్లలో జరుగుతున్న అక్రమాలగురించి మనం టపాలు వ్రాసుకున్నతరవాత, (ఆ టపాల లింకులు పత్రికలకి చేరిన తరవాత) పత్రికలు పరిశోధన చేసి కథనాలు వ్రాస్తున్నాయి.

మన ద మ రై పరిధిలో ప్రతి రోజూ 280 కి పైగా సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రయాణిస్తుంటే, ఒక్క హైదరాబాదు నుంచే రోజూ 160 కి పైగా రైళ్లు వెళుతున్నాయట.

వీటిలో 3 నెలల ముందునించే రిజర్వేషన్ మొదలవుతుంది. కొన్నేళ్ల క్రితం ట్రావెల్ యేజంట్ సంస్థలు 'గుంపగుత్తగా' రిజర్వేషన్లని చేసేసుకొంటూండడం తో, "వ్యక్తుల పేర్లతో మాత్రమే" అదీ ఒక దరఖాస్తుపై 6 గురికి మాత్రమే ఇవ్వాలని నిబంధన విధించి పాటిస్తున్నారు. (ప్రయాణీకుల వయసులు కూడా వుంటాయనీ, అవీ ముఖ్యమైనవే అనీ కావాలనే మరిచి పోయారు!)

యేజంట్ సంస్థలు రాష్ట్రం లో 180 వరకూ వున్నాయట. ఇప్పుడు వీళ్లు తెలుగువాళ్ల మామూలు పేర్లు--వెంకటేశ్వర రావు; సాంబశివరావు; వెంకట్రావు; సుబ్బారావు; సురేష్; రమేష్; శ్రీనివాస్; సాయి; లాంటి పేర్లని వుపయోగిస్తున్నారట. ఇందుకోసం క్రింది స్థాయి సిబ్బందికి 20 నించి 50 రూపాయలు (6 పేర్లున్న ఓ టిక్కెట్టుకి) లాభిస్తోందట.

ఈ టిక్కెట్ కౌంటర్లలో క్యూ లలో జరిగే "సైక్లింగ్" గురించి ఇదివరకే వ్రాశాను. పాపం యేజంట్ల గుమాస్తాలు వాళ్ల పొట్టకోసం ఇవన్నీ చేస్తున్నారు. కౌంటర్లలో సిబ్బంది కూడా, వీళ్లకి 12 టిక్కెట్లిస్తే, సామాన్యులకి మూడో నాలుగో టిక్కెట్లైనా ఇస్తున్నారు. నిజానికి ఇవి పెద్ద లెఖ్ఖలోకి రావు.

ఐ ఆర్ సీ టీ సీ లెవల్లోనూ, తత్కాల్ రిజర్వేషన్లలోనూ లక్షలాది రూపాయల అవినీతి ముందు ఇవెంత? 

పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు మాని, సో కాల్డ్ రైల్వే విజిలెన్స్, కమర్షియల్ సెక్షన్ ల వాళ్లు పెద్ద చేపలకి వలలు వేస్తే, ఈ దరిద్రం తీరుతుంది!

అసలు దీనంతటికీ బాధ్యత కనీసం రెండుబోగీలకైనా ఒక టీటీయీ ని నియమించకుండా, మొత్తం రైలు అంతటికీ ఒకే టీటీ తో పంపిస్తున్న వున్నతాధికారులదే! (జనరల్ టిక్కెట్టు కూడా తీసుకోకుండా, స్లీపర్ బోగీలలో జొరబడుతున్నవాళ్లని నిరోధించేవాడు యెవడూ లేడు!)

అన్నట్టు మొన్న 09-10-2010 న, ఆ మర్నాడు రైల్వే ఎడిషనల్ జీ ఎం వస్తున్నాడని, భీమవరం నుంచి రైల్వే కాంట్రాక్టు సిబ్బందిని రప్పించి, నరసాపురం స్టేషన్ లో వెలగని దీపాలనీ, అపరిశుభ్రంగా వున్న తాగునీటి కుళాయిలనీ, పట్టాలపై, ప్లాట్ ఫారాలపై చెత్తనీ అర్జంటుగా--వెలిగించి, శుభ్రం చేయించారట! 'వున్నతాధికారులొస్తేగానీ......'అని ప్రయాణీకులు చెవులుకొరుక్కున్నారట.

09-10-2010 నే, ప గో జి పాలకొల్లు దగ్గరున్న "దగ్గులూరు" లో 35 అడుగుల (షిర్డీ) సాయిబాబా విగ్రహాన్ని ఆవిష్కరించారట. ఈ సందర్భం గా "గణపతి పూజ"; "పుణ్యహవాచనం"; "మండపారాధన"; "దీక్షా ధారణ"; "రక్షా బంధన"; (35 అడుగుల) బాబాకి "పంచామృతాభిషేకం"; "అంకురార్పణ" నిర్వహించారట. 

"భారీ అన్నసమారాధన"; కార్యక్రమం జరుగుతున్నంతసేపూ భక్తుల "ప్రత్యేక" గీతాలూ కొన....సాగాయట.

(యెవరు యెంత డబ్బు దొబ్బించుకున్నరో, యెవరు యెంత నొక్కేశారో--ఆ బాబాకే తెలియాలి మరి!)

2 comments:

హను said...

evaDi gola vaaDidi anDi.... manam em cheyyalem

A K Sastry said...

డియర్ hanu!

అవునుకదా? మనగోలెవడిక్కవాలి!

"......ఆ పరిస్థితుల్లో మనముంటే" అప్పుడు అలోచిద్దాం లేదా యేడుద్దాం....అంతవరకూ మనం యేమీ చెయ్యలేం!

(పోనీ, ఈ టపా లింకుని రైల్వే విజిలెన్స్ విభాగానికో, కమర్షియల్ సెక్షన్ కో ఫార్వార్డ్ చేసి, వాళ్ల సమాధానం డిమాండు చేస్తే?)

ధన్యవాదాలు.