Sunday, February 26, 2012

మర్మములలోని.......



......మర్మమేమి?

"మర్మం" అంటే....దాచబడినది--అంటే బహిర్గతం కానిది--అని. 

మరి మనుష్యులచే సృష్టించబడ్డ దేవుడు కూడా మనిషిలాగే వుంటాడుకదా? అందుకే ఆయనకీ "మర్మావయవాలు" వుంటాయి. 

సాధారణంగా, దేవుళ్ల విగ్రహాలు   "వస్త్రాలతో" వున్నట్టే చెక్కబడి వుంటాయి--యెక్కడో ఓ శివుడి విగ్రహాన్ని ఆయన కట్టుకున్న పంచె అనే వస్త్రంలోంచి ఆకారం తెలుస్తున్న ఆయన మర్మావయం కనిపిస్తున్నట్టు చెక్కారు తప్ప! 

మరి, దేవుళ్ల విగ్రహాలకి పట్టు వస్త్రాలూ, పీతాంబరాలూ కట్టడం, నగలూ, వస్తువులూ దిగెయ్యడం యెందుకు? 

ఆ వస్త్రాలని "శేష" వస్త్రాలంటూ "భక్తులకి" (డబ్బులు తీసుకొనో, వాళ్లు వీఐపీలు కాబట్టో) అనుగ్రహించడం యెందుకు? వేలం వెర్రిగా, దేవాలయాన్ని సందర్శించిన "గొప్పోళ్లకి" పూర్ణ కుంభ, మేళతాళ స్వాగతాలెందుకు? పోనీ, "విశేష" పూజలెందుకు? తరవాత, బస్తాలతో ప్రసాదాల సమర్పణ యెందుకు? వేద ఆశీర్వచనాలెందుకు? "పట్టు" వస్త్రాల బహూకరణలెందుకు? మళ్లీ యేదో "పుణ్య" తిథి వంకతో "నిజరూప దర్శనాలు" యెందుకు?

సాధారణంగా, మూలవిరాట్ యే రూపంలో వున్నా, వుత్సవ విగ్రహాలని మాత్రం జనసామాన్యానికి వూహకి అందేలా మానవరూప విగ్రహాలుగానే రూపొందిస్తారు. 

శ్రీగిరి (తిరుపతిని ఇలా అనడానికి సాహసించడం లేదుగానీ, తెలుగు పేరే అయిన శ్రీశైలాన్ని శ్రీగిరి అంటున్నారు మన పత్రికలవాళ్లు!) శ్రీపతికి కూడా, అలాగే పెరుమాళ్ రూపంలో వుత్సవ విగ్రహం, నిలబడి వున్నట్టుగా, వుంటుంది. 

యేవాహనం మీద అయినా అలాగే నిలబెట్టో, సిం హాసనంలో కూర్చున్నట్టో అలంకరించి వూరేగిస్తారు. బాగుంది. కానీ, హనుమంతుడు, గరుడుడు వాహనాలమీద మాత్రం, "కృత్రిమ" కాళ్లతో రెండు కాళ్లనీ వాళ్ల చేతులలో పెట్టి, వూరేగించడం యెందుకో?   

అమ్మవారికి బంగారు చీర కడతాననేవాడొకడు, గుడి మొత్తానికి బంగారంతో వెల్లవేస్తాననేవాడొకడు, మట్టీ ఇటుకలతో యేమిటి...ఛీ, ఛీ....బంగారంతోనే గుడి కడతానని కట్టినవాడొకడు........!

యేమిటో! వెర్రి ముదిరితే, తలకి రోకలి చుడితే తగ్గుతుందట. యెన్ని రోకళ్లు కావాలో! తలలకి చుట్టేవాళ్లెంతమంది వుండాలో!!!???

Wednesday, January 11, 2012

భక్తిలో కూడా కొత్తదనం కోసం.......



......వెంపర్లాడుతున్న వీ పీ లు

భక్తిలోనూ, దేవుళ్లలోనూ, పూజల్లోనూ పాత వాటితో విసుగొస్తోందనుకుంటా--యెప్పుడూ విననివి పుట్టుకొస్తున్నాయి. పేపర్లపుణ్యమా అని వ్యాపిస్తున్నాయి.

తలుపులమ్మ గుళ్లలో కూడా "తిరుప్పావై" పఠనాలేమిటి అని, మనకి "అరవ దాస్యం" యెందుకు అని ఇదివరకో టపా వ్రాశాను.

అదేదో సినిమాలో, బ్రహ్మానందానికి వీ పీ (వెరయిటీ పిచ్చోడు) అంటూ వెరయిటీ గా సన్మానం చేయిస్తాడు ఎల్ బీ శ్రీరామ్--చాపమీద కూచోపెట్టి, చిటికెలతో! అలా తయారవుతున్నారేమో మన "తెలుగు" భక్తులు అనిపిస్తూంది. 

ధనుర్మాసంలో, 27వ రోజు అదేదో "కూడారై" వుత్సవంట! అన్ని గుళ్లలోనూ చేసేస్తున్నారు. ఒకచోట 108 "గంగాళాల్లో" "కూడారై" వండి నైవేద్యం పెట్టారట. ఇంకో చోట కొన్ని వందల గంగాళాల్లో వండి, వాడిని "కూడారై" అనే తెలుగు అక్షరాల ఆకారంలో పేర్చి, ఇంకా కొన్ని వందల గంగాళాల్లో వివిధ ఆకృతుల్లో పేర్చి, నైవేద్యం పెట్టారట. (స్థానిక ఎమ్మెల్యే అక్కడ "తగిన" యేర్పాట్లు చేశాడట. రా నా లని ఇలాంటి చోట్లకి  రానివ్వకుండా, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు, "పంచెలూడేలా" తంతే బాగుండును!) 

కూడారై అంటే, భక్తుడు పరమాత్మలో లీనమవడానికి చేసే ప్రయత్నం అంటాడొకడు. ఆ ప్రసాదాన్ని "అక్కార్ వడిశెల్" అన్నాడింకోడు! 

ఈ వుత్సవాల్లో "అవకతవకలు" జరిగాయని, ఏలూరులో ఓ గుళ్లో అర్చకులకి "ఛార్జ్ మెమో" లు ఇవ్వాలని నిర్ణయించారుటకూడా--ఆ కమిటీ వారు!

ఇంకా, అయ్యప్ప భక్తుల్లో, ఇదివరకెప్పుడూ వినని "వేట తుళ్లు" కార్యక్రమం; "మాలికా"నో, "మల్లికా"నో "పురోత్తమ" ప్రతిష్టాపనలు కూడా చేస్తున్నారట! ఆవిడెవరో, యెవరికి భార్యో, యెవరికి తల్లో తెలీదు! (యెర్ర బట్టల "అమ్మవారి దీక్ష" గురించి ఇంకో బ్లాగులో వ్రాశాను--చదివారా?)

కానివ్వండి! వెరయిటీకెప్పుడు ఆహ్వానమేగా మనం!

Tuesday, December 27, 2011

జనలోక్ పాల్ పై………


ప్రభుత్వ “దొంగాటకం”

అయ్యవారిని చెయ్యబోతే, కోతి అయ్యింది అని సామెత. ఇక్కడ సందేహమల్లా, అయ్యవారిని చెయ్యబోతున్నట్టు నాటకమాడి, అసలు కోతినే చేయ్యబోయారా? అన్నది.
రాజ్యాంగ సవరణ వీగిపోవడంతో, జోక్ పాల్ కాస్తా చివరికి “కార్టూన్ పాల్” అయిపోయింది.
ఆ సవరణని నెగ్గించుకొనే సంఖ్యాబలం మీకు లేదు అని సుష్మా స్వరాజ్ చెపుతూంటే, సోనియా, మన్మోహన్, ప్రణబ్ ల ముఖాలు వెలా తెలా పోయాయట! మరి ఆ లెఖ్ఖల పండితులకి చిన్న చిన్న లెఖ్ఖలు రావనుకోవాలా? అలా అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే!
వాళ్ల వుద్దేశ్యం మొదటినుంచీ, అన్నా సవాలుని యెదుర్కొంటున్నామని జనాలని నమ్మిస్తూ, “బిల్లు ప్రవేశ పెట్టడం తో” మా కర్తవ్యం నెరవేర్చాము, అది చట్టం కాకపోతే, పార్లమెంటుది తప్పు అని చేతులు దులిపేసుకోవాలనే. అంతేగానీ, ఎంపీల వేషాలకి అడ్డుకట్ట వేసి, సమగ్రమైన, పటిష్ట జన లోక్ పాల్ ని తీసుకు వద్దామని కాదు.
రేపు రాజ్యసభలో కూడా మొత్తం బిల్లులన్నీ వీగిపోతే, “మహిళా రిజర్వేషన్” లాగే అవి కూడా ఇంకో శతాబ్దంపాటు రోకలి నానేసినట్టు వుండి పోవాలనే వాళ్ల ఆంతర్యం.
102 డిగ్రీల జ్వరంతో అన్నా దీక్ష కొనసాగిస్తున్నాడంటే, ఆయన వుక్కు సంకల్పానికి జన మద్దతు వుంది గనకే!
యెవరో నాయకుడు పార్లమెంట్ లో చెప్పినట్టు, లోక్ పాల్ ప్రసక్తి వచ్చినప్పుడల్లా, పార్లమెంట్ రద్దు అయిపోయింది గత 16 యేళ్లుగానో యెంతో!
ఈప్పుడు జరగబోయేది అదే అని చెప్పడానికి యే నోస్ట్రడామసో అఖ్ఖర్లేదు. “జనమే జవాబు చెపుతారు (కాంగీలూ, భాజపాలూ అన్నట్టు)!”
సత్యమేవజయతే.

Saturday, December 24, 2011

ప్రిజుడిస్ అనే………


……పక్షవా(పా)తం

దాదాపు ఓ దశాబ్దంగా “పిల్” లూ, “జ్యుడిషియల్ ఏక్టివిజం” లాంటి మాటలు తరచూ వినబడుతున్నాయి. మీడియాలోకూడా చర్చలు జరుగుతున్నాయి. కొంతవరకూ బాగానే వుంది.



రానురానూ, పిల్ దాఖలు అవగానే, లేదా, మీడియాలోనో యెక్కడో ఒకవిషయం రేగగానే, న్యాయమూర్తులు వాటిని, కొండొకచో, సువో మోటో గా స్వీకరించడం, తరవాత ప్రథాన న్యాయమూర్తి అనుమతి లేకుండా స్వీకరించారని వారు ఆగ్రహించడం లాంటివి కూడా జరుగుతున్నాయి.



కానీ, కొందరు న్యాయమూర్తులు, తమ “ప్రిజుడిస్” అనే జాడ్యాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శిస్తున్నారు. అందుకే అన్నా జనలోక్ పాల్ పరిధిలోకి జ్యుడీషియరీని కూడా తీసుకురావాలంటున్నది.



ఇప్పుడు, “తాంబూలాలిచ్చేశాం, తన్నుకు చావండి” అన్నట్టు, ఓ జోక్ పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టేశాం, ఇంక ఆ విషయంలో మహాఘనతవహించిన పార్లమెంటు సభ్యులు యే నిర్ణయం తీసుకొంటే అదే అమలు జరగాలి, ఇంకెవరైనా, యేదైనా మాట్లాడితే…..ఖబడ్దార్! అంటున్నారు.



ఆయనే వుంటే మంగలాడెందుకన్నట్టు, మన ఎంపీలు సరైనవాళ్లయితే ఈ తిప్పలన్నీ యెందుకు? ములుగర్రతో పొడుస్తేగానీ వాళ్ల మందమైన చర్మాలు స్పందించడం లేదాయే!



మహాఘనతవహించిన లల్లూ ప్రసాద్, ములాయం సింగ్ యాదవ్, వీరప్పమొయిలీ, పిచ్చిదంబరం, కపిల్సిబల్, లాంటివాళ్లు ఆ బిల్లుని గట్టెక్కకుండా తమ మోకాళ్లూ, మెదళ్లూ శాయశక్తులా వొడ్డుతున్నారు. పైగా, దానికి అష్టావకృడి రూపం ఇవ్వడానికి, సభ్యుల్లో రిజర్వేషన్లూ, అపాయింట్మెంట్ కమిటీల్లో రిజర్వేషన్లూ, మాజీ ఎంపీల మీద చర్యలూ అంటూ వూదరగొడుతున్నారు.



ఇదీ బాగానే వుంది.



కానీ, ముంబాయిలో నిరాహారదీక్ష చేపట్టడానికి అనుమతికోరితే, ఓ పదో పాతికో లక్షలు చెల్లిస్తేగానీ అనుమతి ఇవ్వం అనడమేమిటీ, దానికోసం కోర్టుకి వెళితే, ఆ న్యాయ కొక్కులు, రాజకీయ కొక్కులకి మద్దతు ఇస్తున్నట్టుగా వేళాకోళం మాటలు మాట్లాడడం యేమిటి? అనుమతి ఇస్తారా లేదా అన్నది ప్రక్కనపెట్టి (ఇంతకీ అనుమతిచ్చేది ఆ కోర్టు కాదు!), అనుమతి ఇస్తే, పార్లమెంటు హక్కులకి భంగం కాదా? చేసుకొంటే మీ ఇళ్లలో, పెరళ్లలో ఆందోళన చేసుకోండి. గాంధీగారు కూడా ఇలాంటి ఆందోళనలు చేశారో లేదో మాకు తెలియదు! అంటూ తమ పక్షవా(పా)తాన్ని (దాంతో కూడిన అజ్ఙానాన్ని) ప్రకటించుకోవడం యేమిటి?



రాజకీయ కొక్కులకి న్యాయ కొక్కులు మద్దతు ప్రకటిస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం యేమి కావాలి?


ఆలోచించండి మరి!

Monday, November 14, 2011

వుత్సవాలు.....3



......వైభవంగా

.......జరుగుతున్నాయి--రాష్ట్రమంతటా. 

మా చిన్నతనంలో, మా మేష్టార్లు చెప్పేవారు--"జాతీయ దుబారా" (నేషనల్ వేస్ట్); "నేరమయ దుబారా" (క్రిమినల్ వేస్ట్)--ల గురించి. 

పగటిపూట ఎలెక్ ట్రిక్ లైటు వెలిగించినా, యెవరూ లేనిచోట ఫాన్ తిరుగుతున్నా--అవి "అలాంటి వేస్ట్"లు అని.

మనం ప్లగ్ పాయింట్ల స్విచ్చులు కట్టేసినా, టీవీలూ వగైరా "స్టాండ్ బై"లో పెట్టినా, యెంతో కొంత కరెంటు "కాలుతుంది" అనీ, వుత్తమ విధానం ఆ ప్లగ్ పిన్స్ ని తొలగించడమేననీ శాస్త్రఙ్ఞులు చెపుతున్నారు. 

మన ఎస్పీ బాలు కూడా చెపుతున్నాడు!

మనందరం ఇంత "జాగ్రత్తగా" కరెంటు వాడుకుంటూంటే.......

అనేక "గుళ్ల"లో, "దేవాలయాల"లో, "పందిళ్ల"లో, ఇవేకాకుండా పర్యాటక స్థలాల్లో, పుట్టినరోజు, సమర్త లాంటి ప్రైవేటు ఫంక్షన్లలో--ఇలా ప్రతీ చోటా "సీరియల్ లైట్లు" దండలు దండలుగా వెలిగించడం, పేపర్లలో "వైభవంగా...." అంటూ వార్తలు రావడం (వ్రాయించుకోవడం) లాంటివి జరుగుతున్నాయి.....ప్రతీరోజూ చూస్తున్నాం.

మరి, వీటన్నింటికీ అయ్యే "కరెంటు ఖర్చు" యెవరిస్తున్నారు? యెవరిచ్చినా, అదంత అవసరమా? 

కరెంటు దీపాల్లేనిరోజుల్లో, గుళ్లెక్కడున్నాయో ప్రజలకి తెలియదా? వాళ్లు పూజలూ, వ్రతాలూ, అభిషేకాలూ చేసుకోలేదా? 

ఇదంతా యెవడబ్బ సొమ్ము?

భక్తి పేరుతో, ఆ "లైటింగు"వాళ్లు బాగుపడడానికి (వృధ్ధిరేటులో వాళ్లూ భాగమేకదా!), "జాతీయ దుబారా" కోసం, కాక ఇవేమిటి? (వాళ్లూ బ్రతకాలిగా?!).

అందుకే.......భక్తి వ్యాపారులూ జిందాబాద్!

Sunday, November 13, 2011

వుత్సవాలు.....2




......వైభవంగా

.......జరుగుతున్నాయి-- రాష్ట్రమంతటా. 

కొన్ని కొత్త కొత్త వుత్సవాలూ, పూజలూ, నోములూ వగైరాలగురించి మొదటిసారి వింటున్నాము.

వాటిలో ఒకటి--వివాహమైన మొదటియేడాది వచ్చే కార్తీక పౌర్ణమికి--11అరటిపళ్లున్న హస్తాన్ని, బూడిదగుమ్మడి పువ్వు, పిందె, సూరే గుమ్మడి కాయ, పసుపు మొక్క, కంద మొక్క, చెట్టునుంచి చేతితో (క్రిందపడకుండా) అందుకున్న కొబ్బరికాయల గెల--శివాలయంలో నైవేద్యంగా నివేదిస్తే శుభాలు సమకూరతాయని--"పదకొండు కాయలున్న అరటిపళ్ల హస్తానికి" గిరాకీ పెరిగి, ఒక్కోటీ రూ.150/- కి అమ్మారట!

వేదమంత్రోశ్చ/శ్చారణ అని వ్రాస్తున్నారు! అది వుచ్చారణ అని వ్రాయాలి. పునశ్చరణ అన్నట్టు కాదు. 

మనకి అర్చకులూ, పూజారులూ, పండితులూ తెలుసు. కానీ ఈ మధ్య కొత్తరకం పండితులు పుట్టుకొచ్చారు--వేదపండితులు, దీపాలంకరణ సేవా పండితులు, అభిషేక పండితులు....ఇలా! 

వేదాలు చదవడానికీ, ఆశీర్వచన పనసలు చెప్పడానికీ వేదాల్లో పాండిత్యం అఖ్ఖర్లేదు. అయినా, వాళ్లకి ఇంకో మాటలేక, వేదపండితులు అని వ్యవహారంలోకి వచ్చింది. సరే. మరి అభిషేక పండితులూ, దీపాలంకరణ పండితులూ యెవరు? పేపర్లవాళ్లు ఇస్తున్నారా ఆ బిరుదులు? ఇంకెవరైనా అలా వ్రాయిస్తున్నారా?

దీపాలంకరణ అంటే గుర్తొచ్చింది. ఇదివరకు గృహస్థులు ప్రతీరోజూ దీపారాధన చేశాక మాత్రమే భోజనం చేసేవారు. అలా సంవత్సరంలో యే కొన్ని రోజులైనా, యే అస్వస్థత లేదా ఇతరకారణాలవల్లనో దీపం పెట్టలేకపోయి వుంటే, దానికి ప్రత్యామ్నాయంగా కార్తీక పూర్ణిమరోజున శివాలయంలో "ఒక దీపం" వెలిగిస్తే సరిపోతుందనేవారు. 

ఇప్పుడు యెవరూ ప్రతీరోజూ దీపాలు వెలిగించడంలేదు కాబట్టి, "పండితులు" ఆ రోజున 365 దీపాలు వెలిగించమంటున్నారట! బాగుంది. మరి "సహస్ర" దీపాలమాటేమిటి? అలా అందరూ యెగబడి ఒక్కోళ్లూ 365 చొప్పున పెట్టుకొంటూ పోతే, సహస్ర యేమి ఖర్మ.....లక్షల్లో పెట్టినా చాలవు!

పైగా, ఇది వరకు కిరాణా షాపుల్లో నూనెలు తూచడానికి ఓ పళ్లెం లంటిది కాటాలో పెట్టుకొని, అందులో మన సీసానో, డబ్బానో వుంచి, పడికట్టి, వాళ్ల డొక్కులతో నూనె పోసేవారు. ఆ సమయంలో కొంతనూనె ఆ ట్రేలో పడేది. కొట్టు కట్టేసేప్పుడు ఆ ట్రేలో పడిన అన్నిరకాల నూనెల మిశ్రమాన్ని వేరే డబ్బాలోపోసి, నిల్వ చేసేవారు. దాన్ని దీపావళికి "దీపాల నూనె" పేరుతో చవగ్గా ఇచ్చేవారు. 

ప్రమిదలో దీపం పెట్టాలంటే ఆముదం వుపయోగించాలి. ఆ పొగ, కళ్లకి మంచిది. వాసన కూడా ఆరోగ్యం. మిగిలిన యే నూనె అయినా, కళ్లు మండుతాయి. పొల్యూషన్ పెరుగుతుంది!

ఇంకా, మనదేశం వార్షిక వంటనూనెల దిగుమతి బిల్లు కొన్ని వందలకోట్ల లో వుంటోంది! నూనెలని దుబారా చేస్తే పుణ్యం వచ్చేస్తుందా?

ప్రమాదాల సంగతి సరేసరి. మొన్న మావూళ్లో ఓ గుళ్లో, సహస్ర దీపాలకోసం ప్రమిదల్లో నూనెపోస్తూంటే, అక్కడే ఆడుకొంటున్నపిల్లలు పొరపాటున నూనె వంపేశారు. మైకులో "నూనె వలికింది....జాగ్రత్త" అని హెచ్చరిక చేస్తున్నా, ఒకావిడయెవరో జర్రున జారి, ప్రక్కామెమీద పడడం, పేకమేడలో పేకల్లా ఒకళ్లమీద వొకళ్లు పడిపోయడం జరిగిపోయాయి. అదృష్టవశాత్తు పెద్ద దెబ్బలూ, ఫ్రాక్చర్లూ జరగలేదెవరికీ!

టీవీలో విశాఖపట్నంలో అనుకుంటా ఒకావిడ చీర అంటుకోవడం, ఆవిడ కెవ్వు కెవ్వుమని అరుస్తూ వుండడం, చుట్టుప్రక్కల ఆడవాళ్లు దూరంగా పారిపోతూంటే, కొందరు చీర విప్పెయ్యమనీ, కొందరు క్రిందపడి దొర్లమనీ సలహాలిస్తూండడం చూశాము!

ఇవన్నీ అంత అవసరమా?


Saturday, November 12, 2011

అధిష్టాన తె'లంగా'నం



విస్తృత సంప్రదింపులు

మనదేశంలో కాంగీవాళ్లూ, మీడియా వాళ్లూ 'ఓ ప్రత్యేకజాతిగా' గుర్తించినవాళ్ల (ప్రపంచ వ్యాప్తంగా వున్న ఓ మతానికి సంబంధించిన.....కాదు!) పండుగ తరవాత, ఓ నిర్ణయం వస్తుంది అని వూదరగొట్టారు--బొచ్చె లాంటివాళ్లు. 

గులాం నబీయేమో, తాంబూలాలు ఇచ్చేశాను....కోర్ కమిటీవాళ్లే తన్నుకు చస్తారు--అనేశాడు. 

మధ్యలో మాయ వేసిన బ్రేకు లో పడి, "రెండో ఎస్సార్సీ" అన్నారొకడో, ఇద్దరో! 

"ఆమాటన్నవాడి నాలుక చీరేస్తాం. గొంతుక కోసేస్తాం" అనలేదు బక్కన్న. 

ఇంతకీ, రోకలి తన పన్నుతోసహా నానిందా? 

అప్పుడేనా! 

ఇవాళ మన నీలం పాగా గడ్డపోడు "విస్తృత సంప్రదింపులు జరుగుతున్నాయి, ఆ పనిమీదే వున్నాం" అన్నాడు. 

మాయమ్మేమో, "నా రాజ్యానికివచ్చినప్పుడే నీ నోరులేస్తోందేమి బిడ్డా? ఢిల్లీ లో నీతల్లికి సమ్‌ఝాయించు బే!" అని గర్జించింది. 

గజం మిధ్య, పలాయనం మిధ్య!