Thursday, December 2, 2010

వీర భక్తి

ఆచరణలూ

ఈనాడు 01-12-2010 'ఇదీ సంగతి' చూశారా? ముహూర్తాలమీదో మంచి కార్టూన్!

మొన్న ప గో జి తిమ్మరాజుపాలెం (నిడదవోలు) లో కోట సత్తెమ్మ ఆలయానికి 'బోనుమద్ది రామలింగ సిధ్ధాంతి' పర్యవేక్షణలో "వైదిక సువార్త ఆగమ" ఆచారం ప్రకారం "ధ్వజ స్థంభ" ప్రతిష్ట జరిగిందట.

బహుశా 'సువార్త' మహామునో, 'సువార్తో' మహామునో యేర్పరచి వుంటాడు ఈ ఆగమాన్ని. ఇక ఆ మహామునికి కూడా విగ్రహాలూ, ఆలయాలూ తరవాయి. యెవరు మొదలెడతారో మరి.

నరసాపురం లో సత్యసాయి ఆలయం లో ఆయన 85 వ జన్మదినోత్సవానికి 85 రకాల పిండివంటలతో 'మహా నివేదనం' చేసి, కేక్ కూడా కట్ చేశారట. పేదలకి దుప్పట్లు పంపిణీ చేశారట. 85 రకాల పిండివంటలు యెవరు తిన్నారో వ్రాయలేదు.

No comments: