Friday, December 3, 2010

మూర్ఖత్వాలు.......

.......పరాకాష్టలు

చాలా వింతైన మహాఘోరమైన ఓ దరిద్రగొట్టు వార్త వచ్చింది--

01-12-2010 న, పగోజి ఏలూరు దగ్గర చాటపర్రు గ్రామం లో, "ప్రాథమిక పాఠశాల" విద్యార్థులు ఓ 90 మంది రోజూ మధ్యాహ్న భోజనం చేస్తుంటారట--సుమారు ఓ పదిహేనుమంది ఫోటోలు కూడా వేశారు--మధ్యాహ్న భోజన పథకం లో తమకి ఇన్నాళ్లూ వంటచేసి, రుచికరంగా భోజనం పెడుతున్న జి.రాణి అనే డ్వాక్రా మహిళ--వాళ్ల గ్రూపు తగాదాల కారణంగా వంటకి రాలేదని--'ప్రహరీ దూకి వెళ్లి, యెదురుగావున్న కిరాణా దుకాణం లో బ్లేడ్లని (సంగ్రహించి) వాటితో' తమ చేతులు 'రక్తాలు ఓడేలా' కోసుకొని, 'రాణి మాకు కావాలి' అంటూ కాగితాలపై వ్రేలి ముద్రలు వేశారు!

తరవాత అధికారులు వచ్చి, "మండల విద్యా కమిటీ నిర్ణయం తీసుకొనేవరకూ" వాళ్లెవరూ (రాణితోసహా) వంట చెయ్యడానికి వీల్లేదని ఆదేశించారు(ట).

ఇక్కడ ప్రశ్న, రేపు ఈ పదేళ్ల లోపు చిన్నారులు పెద్దయి, తాము ప్రేమించినవాళ్లని మేదర కత్తులతో నరకడం, లేదా చేతులు కోసుకొని ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చెయ్యకుండా వుంటారా? అని.

వీళ్లని ఈ చర్యకి ప్రేరేపించినవాళ్లు పెద్దవాళ్లయితే, వాళ్లని ఓ బెంచీమీద పడుకోబెట్టి కట్టేసి, రెండు చేతులనీ చెరో పక్కా వ్రేళ్లాడదీసి, మణికట్లదగ్గర ధమనులని బ్లేడుతో కోసేసి, నీళ్ల బకెట్లలో వదిలెయ్యాలని శిక్ష విధించాలి.

వాళ్లు మైనర్లయితే, ప్రభుత్వం వుచితంగా మానసిక చికిత్స చేయించాలి--అవసరమైతే పిచ్చాసుపత్రుల్లో చేర్పించి!

అందరూ యెలుగెత్తండి మరి!

పగోజి గుండుగొలనులో భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం లో నూతనంగా నిర్మించిన రాజగోపురానికి 'కలశ ప్రతిష్ట' చేశారట 01-12-2010 న. 

అంతకుముందు రెండురోజులుగా, 'శైవాగమన' (అగమ సిధ్ధాంతం అని ఈనాడు వారి కవిహృదయం) పండితులు వుల్లేటికుర్తి భోగేశ్వర శర్మ ఆధ్వర్యం లో వాస్తుహోమం........వగైరా వైభవంగా జరుగుతున్నాయట.

ఇక 'శైవన' మునీంద్రుడినో, 'శైవనో' మునీంద్రుడినో పుట్టించి గుళ్లు కట్టిస్తారేమో!

నిన్న 02-12-2010 న, తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలకి, అర్చకులు 'పాంచరాత్ర' ఆగమ శాస్త్రోక్తంగా పూజలను జరిపించారట.

ఇక 'పాంచరాత్ర' మునీంద్రుడికో, 'పాంచరాత్రో' మునీంద్రుడికో కూడా గుళ్లు కట్టేస్తారేమో!

చూద్దాం!

No comments: