Sunday, February 26, 2012

మర్మములలోని.......



......మర్మమేమి?

"మర్మం" అంటే....దాచబడినది--అంటే బహిర్గతం కానిది--అని. 

మరి మనుష్యులచే సృష్టించబడ్డ దేవుడు కూడా మనిషిలాగే వుంటాడుకదా? అందుకే ఆయనకీ "మర్మావయవాలు" వుంటాయి. 

సాధారణంగా, దేవుళ్ల విగ్రహాలు   "వస్త్రాలతో" వున్నట్టే చెక్కబడి వుంటాయి--యెక్కడో ఓ శివుడి విగ్రహాన్ని ఆయన కట్టుకున్న పంచె అనే వస్త్రంలోంచి ఆకారం తెలుస్తున్న ఆయన మర్మావయం కనిపిస్తున్నట్టు చెక్కారు తప్ప! 

మరి, దేవుళ్ల విగ్రహాలకి పట్టు వస్త్రాలూ, పీతాంబరాలూ కట్టడం, నగలూ, వస్తువులూ దిగెయ్యడం యెందుకు? 

ఆ వస్త్రాలని "శేష" వస్త్రాలంటూ "భక్తులకి" (డబ్బులు తీసుకొనో, వాళ్లు వీఐపీలు కాబట్టో) అనుగ్రహించడం యెందుకు? వేలం వెర్రిగా, దేవాలయాన్ని సందర్శించిన "గొప్పోళ్లకి" పూర్ణ కుంభ, మేళతాళ స్వాగతాలెందుకు? పోనీ, "విశేష" పూజలెందుకు? తరవాత, బస్తాలతో ప్రసాదాల సమర్పణ యెందుకు? వేద ఆశీర్వచనాలెందుకు? "పట్టు" వస్త్రాల బహూకరణలెందుకు? మళ్లీ యేదో "పుణ్య" తిథి వంకతో "నిజరూప దర్శనాలు" యెందుకు?

సాధారణంగా, మూలవిరాట్ యే రూపంలో వున్నా, వుత్సవ విగ్రహాలని మాత్రం జనసామాన్యానికి వూహకి అందేలా మానవరూప విగ్రహాలుగానే రూపొందిస్తారు. 

శ్రీగిరి (తిరుపతిని ఇలా అనడానికి సాహసించడం లేదుగానీ, తెలుగు పేరే అయిన శ్రీశైలాన్ని శ్రీగిరి అంటున్నారు మన పత్రికలవాళ్లు!) శ్రీపతికి కూడా, అలాగే పెరుమాళ్ రూపంలో వుత్సవ విగ్రహం, నిలబడి వున్నట్టుగా, వుంటుంది. 

యేవాహనం మీద అయినా అలాగే నిలబెట్టో, సిం హాసనంలో కూర్చున్నట్టో అలంకరించి వూరేగిస్తారు. బాగుంది. కానీ, హనుమంతుడు, గరుడుడు వాహనాలమీద మాత్రం, "కృత్రిమ" కాళ్లతో రెండు కాళ్లనీ వాళ్ల చేతులలో పెట్టి, వూరేగించడం యెందుకో?   

అమ్మవారికి బంగారు చీర కడతాననేవాడొకడు, గుడి మొత్తానికి బంగారంతో వెల్లవేస్తాననేవాడొకడు, మట్టీ ఇటుకలతో యేమిటి...ఛీ, ఛీ....బంగారంతోనే గుడి కడతానని కట్టినవాడొకడు........!

యేమిటో! వెర్రి ముదిరితే, తలకి రోకలి చుడితే తగ్గుతుందట. యెన్ని రోకళ్లు కావాలో! తలలకి చుట్టేవాళ్లెంతమంది వుండాలో!!!???

No comments: