Tuesday, March 24, 2015

శ్రీరామ నవమి


శ్రీరాముడూ, సీతాదేవీ.....తలంబ్రాలూ.....

"అదుగో భద్రాద్రీ.....గౌతమి అదుగో చూడండీ....రామదాసు నిర్మించిన ఆలయం...." అని పరవశించి పాడుకుంటూ శ్రీరామనవమి నాటి కళ్యాణానికి తరలిపోయేవారు తెలుగు జనాలు.

తానీషా, ప్రతీ సంవత్సరం తలంబ్రాల నిమిత్తం గోల్కొండ నుంచి మంచి ముత్యాలు పంపించేవాడట. (తరువాత వాటిని యెలా యేరేవారో, మళ్లీ భద్రంగా గోల్కొండ యెలా చేర్చేవారో తెలీదు గానీ, ఆ తరువాత యేడాది మళ్లీ అవే ముత్యాలని పంపించేవాడట!)

ప్రజా ప్రభుత్వాలు యేర్పడి, ఆంధ్ర రాష్ట్రం యేర్పడ్డాక, హైదరాబాదు సంస్థానం విలీనం అయ్యేవరకూ ఇది కొనసాగినట్టుగానే వుంది. విలీనం తరవాత, ఆంధ్ర ప్రదేశ్ యేర్పడే వరకూ ఈ ఆచారం కొనసాగినట్టు దాఖలాలు వున్నాయో లేదో నాకు తెలీదు.

ఆంధ్ర ప్రదేశ్ కి హైదరాబాదు రాజధాని అయ్యాక, మళ్లీ యెప్పుడో....తలంబ్రాలకి మంచి ముత్యాలూ, పట్టు వస్త్రాలూ ప్రభుత్వం తరఫున పంపించడం మొదలెట్టారు. (అప్పుడు కూడా అవి హైదరాబాదు యెలా తిరిగి వెళ్లేవో, తరువాత యేడాది వాటినే యెలా పంపించే్వారో....ఆ రాముడికే యెరుక!)

తరవాత తరవాత, అనేకసార్లు ఆలయం లో చోరీలూ, పునరుధ్ధరణలూ జరిగాక, క్రమ క్రమంగా తలంబ్రాల బియ్యాన్ని చిన్న చిన్న పొట్లాలు కట్టి, భక్తులకి అందజేయడం మొదలెట్టారు. 

ఇటీవల ఈ 'తలంబ్రాల' బాగోతం యెంత పరాకాష్ట కి చేరిందంటే......

(........మరోసారి)

No comments: