Sunday, March 7, 2010

ఇంకో.......

వింతాభిషేకం

తూర్పుగోదావరి జిల్లాలోని అయినవిల్లి లోని సిధ్ధి వినాయక స్వామికి మొన్న లక్ష కలాలతో అభిషేకం నిర్వహించారట.

వ్యాసమహర్షి ఆఙ్ఞతో గణపతి మహాభారతాన్ని వేగం గా లిఖించినట్లు పురాణాల్లో వుందట--అందుకని!

మరి ఆయన రాసినది 'గంటం' తో ననుకుంటా!

ముందుగా స్వామికి గరికగడ్డి, నారికేళఫలాలతో మహారుద్రాభిషేకాన్ని నిర్వహించారట!

సరే, గరిక అయితే, విగ్రహం నెత్తిమీద వేసేస్తారనుకోవచ్చు--మరి కొబ్బరికాయలు యెలా అభిషేకిస్తారో?

ఆ తరవాత లక్ష పెన్నులను స్వామి పాదాల ముందు గుట్టగా పోసి, పూజలు చేశారట. ఈ కలాలతో పరీక్షల్లో వ్రాస్తే, తప్పకుండా ప్యాసు అవుతారట.

మరి అవి చెక్కకలాలా, వూట కలాలా, బంతి కలాలా--యెలాంటివో తెలియదు. వాటికి ఖర్చు యెంతయిందో తెలియదు. ఆ డబ్బు మాత్రం ప్రజలదే అయి వుంటుంది.

అక్కడి ప్రజా ప్రతినిథులు నలుగురో యెంతమందో ఆ పెన్నులని విద్యార్థులకి అందించారట--ఆ పెన్నులకోసం విద్యార్థులు రెండుకిలోమీటర్ల మేర బారులు తీరారట!

అదండీ సంగతి!

No comments: