Friday, April 2, 2010

ఆ దేవుడు కూడా క్షమించని.......

కులాల ప్రసక్తి


త్రేతాయుగం లో జరిగినట్టు చెప్పబడుతున్న రామాయణం లో జాతుల ప్రసక్తి వుంది గాని, కులాల ప్రసక్తి అంతగా లేదు.

ముఖ్యం గా 'దైత్య ' (రాక్షస) జాతిని నిర్మూలించడానికే రామావతారం వచ్చింది.

(ఓ ముఫ్ఫయ్యేళ్ళక్రితం, ద్రవిడ కజగం స్థాపకుడు, పెరియార్ ఈ వీ రామస్వామి నాయకర్--రావణలీల జరిపించి, రాముణ్ణి వాహనం పై చెప్పులతోనూ, రాళ్ళతోను కొట్టిస్తూ, మదరాసు వీధుల్లో వూరేగించేవాడు! అప్పట్లో నిరసనలు లేవు. దేశవ్యాప్త నిరసనలు అసలే లేవు!)

ఆ కాలం లో బ్రాహ్మణులు పురోహితులుగా, యఙ్ఞాది కర్మలు చేయించేవాళ్ళుగా, చదువు చెప్పేవాళ్ళుగా, ప్రజల మంచికోసం ముహూర్తాలూ అవీ పెట్టేవాళ్ళుగానే వుండేవారు.

క్షత్రియులు, రాజ్య పాలన చేసేవారు. సైన్యం లో ముఖ్య పదవులు అధిష్టించేవారు.

వైశ్యులు వాణిజ్యం చేసి, వణిక్ ప్రముఖులుగానే వుండేవారు.

శూద్రులు పొలాల్లో పంటలు పండించడం చేసేవారు, యాదవులు పశుపోషణ చేసేవారు, మిగిలిన కులాలవాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తులు చేసుకునే వారనే అనుకోవాలి.

గుహుడు, శబరి వంటివాళ్ళు ఆయనని దైవం గానే కొలిచారు!

ఆ యుగాంతానికి కొంచెం ముందు, 'శంబూక వథ ' జరిగింది. ఆ పంచముడు తపస్సు చేస్తున్నాడని కొందరు రాముడికి ఫిర్యాదు చెయ్యగానే, ససైన్యం గా వెళ్ళి, 'నీవు నీ ధర్మాన్ని అతిక్రమించావు. అందుకని నిన్ను వధించక తప్పడం లేదు.' అన్నాడంటారు.

(ఇది 'వాల్మీకం' లో వుంది అని కొంతమంది, లేదు ప్రక్షిప్తం అని కొంతమంది అంటారు.)

ద్వాపర యుగానికి వచ్చేసరికి, కుల వ్యవస్థ బలపడింది. క్షత్రియులే కాకుండా, యాదవులు, నాగులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు--మొదలైన వాళ్ళు కూడా రాజ్యపాలన సాగించారు.

సైన్యం లో అన్ని కులాలవాళ్ళూ వుండి, వాళ్ళ వృత్తుల్ని కొనసాగించేవారు!

ఇక కలియుగం లో, మనకి తెలిసిన చరిత్ర ప్రకారం దండయాత్ర చేసి, ఢిల్లీ సిం హాసనాన్ని ఆక్రమించుకున్న షేర్ షా సూరీ కాలం లో, మొదటిసారి 'శిస్తు వసూళ్ళ ' వ్యవస్థని ప్రవేశపెట్టి ఆర్థిక వ్యవస్థని క్రమబధ్ధీకరించాడు.

ఆ క్రమం లో, సామంత రాజులకి ఆ అధికారాలు దఖలు పడి, వాళ్ళు వసూలు చేసిన దాంట్లో పెద్ద మొత్తాలని ఢిల్లీ నవాబుకి చెల్లించేవారు.

రాజులు లేని వ్యవసాయ ప్రాంతాలూ, అరణ్య ప్రాంతాలూ, కొండ ప్రాంతాలకి సంబంధించి, అక్కడ వారసత్వం గా కొంత భూవసతి కలిగిన వాళ్ళు ఆ ప్రాంతాలపై తమకి వసూళ్ళ అధికారాన్ని ఇమ్మని నవాబుకి మహజరు సమర్పిస్తే, సరేనని ఆ ప్రాంతానికి అతణ్ణి అధికారిగా నియమించేవారు.

అలావచ్చినవే 'చౌధురి ' మొదలైన పదవులు. (చతుర్థ హారి--అంటే వసూలు చేసిన దాంట్లో నాలుగో వంతు హరించి, మూడు వంతులు నవాబుకి చెల్లించేవారు--అదే కాలక్రమం లో చౌధరి గా మారిందంటారు. ఇంగ్లీషువాళ్ళు కడప వర్ణక్రమం లో వుపయోగించినట్టు వ్రాయడం వల్ల, అది చౌధురి అయ్యింది!)

అదుగో--అక్కడ పడింది జమీందారీ, ఇనాందారీ, మొఖాసాదారీ, శిరస్థదారీ మొదలైన వ్యవస్థలకి.

స్వర్ణ యుగం గా పేరుపడ్డ గుప్తుల కాలం వచ్చేసరికి, ఆర్థిక వ్యవస్థ మరింత పకడ్బందీ గా నడిచి, అందరూ సుఖ సంతోషాలతో జీవించేవారు--పాలన బాగుండడం వల్ల. ఇందుకు ముఖ్య కారణం 'కౌటిల్యుడు '.

మొఘలాయి పాలన వచ్చేసరికి, ఆర్థిక వ్యవస్థ చక్కగా నడిచేది--కాని ఈ జమీందారులూ వాళ్ళూ చాలా బల పడ్డారు--నవాబు వాళ్ళకి పూర్తిగా మద్దతు ఇస్తూండటం తో.

(గోల్కొండ నవాబు క్రింద పని చేసిన అక్కన్న, మాదన్న లు అలాంటివారే. అందులో అక్కన్ననే తానీషా అనేవారు. ప్రజల అఙ్ఞానాన్ని డబ్బులుచేసుకోవడం కోసం, క్యామెడీ కోసం తొట్టి గ్యాంగుకి పాత్రలు కల్పించడానికి, శ్రీ రామ దాసు సినిమాలో చరిత్రనీ, వాస్తవాన్నీ వక్రీకరించారు!)

(అప్పుడే తిట్టడం మొదలెట్టెయ్యకండి--ఇంకా చదవండి! మళ్ళీ వ్రాస్తాగా!)

2 comments:

Unknown said...

అలావచ్చినవే 'చౌధురి ' మొదలైన పదవులు. (చతుర్థ హారి--అంటే వసూలు చేసిన దాంట్లో నాలుగో వంతు హరించి, మూడు వంతులు నవాబుకి చెల్లించేవారు--అదే కాలక్రమం లో చౌధరి గా మారిందంటారు. ఇంగ్లీషువాళ్ళు కడప వర్ణక్రమం లో వుపయోగించినట్టు వ్రాయడం వల్ల, అది చౌధురి అయ్యింది!)

nijamenaa ???? jokeaa

A K Sastry said...

డియర్ Bobby!

ఇలాంటి విషయాల్లో జోకులుండవు. ఇవి పచ్చి నిజాలు.

అలా వచ్చినవాళ్ళే 'దేవీ ప్రసాద్ రాయ్ చౌధురీ', 'అబ్దుల్ ఘనీఖాన్ చౌధురీ' లాంటివాళ్ళు.

ఇంకా అలాంటివాళ్ళే 'మొఖాసాదారు 'లూ, 'దేశముఖ్' లూ, 'జాగీరుదారు ' లూ, మొదలైనవాళ్ళు.

ధన్యవాదాలు.