Tuesday, December 27, 2011

జనలోక్ పాల్ పై………


ప్రభుత్వ “దొంగాటకం”

అయ్యవారిని చెయ్యబోతే, కోతి అయ్యింది అని సామెత. ఇక్కడ సందేహమల్లా, అయ్యవారిని చెయ్యబోతున్నట్టు నాటకమాడి, అసలు కోతినే చేయ్యబోయారా? అన్నది.
రాజ్యాంగ సవరణ వీగిపోవడంతో, జోక్ పాల్ కాస్తా చివరికి “కార్టూన్ పాల్” అయిపోయింది.
ఆ సవరణని నెగ్గించుకొనే సంఖ్యాబలం మీకు లేదు అని సుష్మా స్వరాజ్ చెపుతూంటే, సోనియా, మన్మోహన్, ప్రణబ్ ల ముఖాలు వెలా తెలా పోయాయట! మరి ఆ లెఖ్ఖల పండితులకి చిన్న చిన్న లెఖ్ఖలు రావనుకోవాలా? అలా అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే!
వాళ్ల వుద్దేశ్యం మొదటినుంచీ, అన్నా సవాలుని యెదుర్కొంటున్నామని జనాలని నమ్మిస్తూ, “బిల్లు ప్రవేశ పెట్టడం తో” మా కర్తవ్యం నెరవేర్చాము, అది చట్టం కాకపోతే, పార్లమెంటుది తప్పు అని చేతులు దులిపేసుకోవాలనే. అంతేగానీ, ఎంపీల వేషాలకి అడ్డుకట్ట వేసి, సమగ్రమైన, పటిష్ట జన లోక్ పాల్ ని తీసుకు వద్దామని కాదు.
రేపు రాజ్యసభలో కూడా మొత్తం బిల్లులన్నీ వీగిపోతే, “మహిళా రిజర్వేషన్” లాగే అవి కూడా ఇంకో శతాబ్దంపాటు రోకలి నానేసినట్టు వుండి పోవాలనే వాళ్ల ఆంతర్యం.
102 డిగ్రీల జ్వరంతో అన్నా దీక్ష కొనసాగిస్తున్నాడంటే, ఆయన వుక్కు సంకల్పానికి జన మద్దతు వుంది గనకే!
యెవరో నాయకుడు పార్లమెంట్ లో చెప్పినట్టు, లోక్ పాల్ ప్రసక్తి వచ్చినప్పుడల్లా, పార్లమెంట్ రద్దు అయిపోయింది గత 16 యేళ్లుగానో యెంతో!
ఈప్పుడు జరగబోయేది అదే అని చెప్పడానికి యే నోస్ట్రడామసో అఖ్ఖర్లేదు. “జనమే జవాబు చెపుతారు (కాంగీలూ, భాజపాలూ అన్నట్టు)!”
సత్యమేవజయతే.

1 comment:

కమనీయం said...

please see my comment on the same subject,written in Telugu in Haaram.