Tuesday, March 4, 2014

శ్రీగిరి శ్రీపతి--తి తి దే........


............అన్యమతస్తులూ 

మొన్ననే వేరే చోట తి తి దే గురించి సణగడానికి యేమీ లేదు అని వ్రాశానో లేదో, అవకాశం రప్పించాడు జగన్‌.

తన అనుచరులు 300 మందితో శ్రీగిరి శ్రీవారి ఆలయం చేరుకొని, చెప్పులతోనే వైకుంఠం వైపు వెళ్లబోతుంటే, అనేక మంది గట్టిగా అరవడంతో, ప్రక్కన విప్పి వెళ్లాడట. ఆలయ ప్రవేశానికి ఇవ్వ వలసిన డిక్లరేషన్‌ కూడా ఇవ్వలేదట. ఇదివరకోసారి అలా ఇవ్వకుండా వెళ్లి, తన అనుచరులనుంచే విమర్శలు యెదుర్కొన్నాడు. అయినా బుధ్ధి రాలేదు. రాకపోవడం కాదు. అహంకారం! హిందూ మనోభావాలపై యే విధమైన గౌరవం లేకపోవడం!

ఇంతకు ముందు, వాళ్ల బాబు అక్కడ యేడు కొండలు ఎక్కడున్నాయి? వున్నవి రెండే కదా! అని కొక్కిరించి, ఆ కొండలన్నీ లెఖ్ఖపెడుతూనే కూలిపోయాడు. అయినా వీడికి బుద్ధి రావడం లేదు. 

దేవస్థానం వారు ఆ మూకకి ఎల్-1 కేటగిరీ క్రింద ప్రత్యేక పాస్ లు జారీ చేసి మరీ ప్రత్యేక మర్యాదలతో దర్శనం చేయించారట. అందుకోసం రెండు గంటలకి పైగా క్యూలైన్లు ఆపేసి, వీఐపీ దర్శనాలు కూడా ఆపేసి, అందరినీ ఇబ్బంది పెట్టారట. అంతేకాదు, వాడి కోసం ఓ ఇరవై నిమిషాల ముందే, నైవేద్యం గంట మోగించి, శ్రీవార్ని కూడా ఇబ్బంది పెట్టారట. రంగనాయకుల మంటపం లో వేదాశీర్వచనం కూడా పలికారట--వాళ్లకి యెంత సిగ్గులేదో!
అనంతరం, జేఈవో శ్రీనివాసరాజు స్వయంగా వాణ్ని సత్కరించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలని అందజేశారట. ప్రథాన అర్చకుడు రమణ దీక్షితులతో కలిసి, పడికావలి దగ్గర నిల్చొని, వాళ్ల దర్శనాలని పర్యవేక్షించారట. వాడు బసచేసిన ఆదిత్య బిర్లా విశ్రాంతి సముదాయం లో వందలాది మందికి, భోజన, అల్పాహార విందు యేర్పాటు చేశారట. 

వాడికి బుధ్ధిలేకపోతే పోయింది, కూడా వెళ్లిన రెడ్లందరూ కిరస్తానీలు కాదు కదా....వాళ్లయినా చెప్పరా? నటి రోజా కూడా వుందట కూడా. వీళ్లకీ హిందువులంటేనూ, వాళ్ల దేవుళ్లంటేనూ లెఖ్ఖ లేదా?

వెంటనే ఆ జేఈవోనీ, ప్రథానార్చకుణ్నీ ఇంటికి పంపించాలనీ, ఇంకా సహకరించిన సిబ్బంది అందరినీ శిక్షించాలి అనీ హిందూ సంఘాలవాళ్లు డిమాండ్ చెయ్యవలసిన సమయం ఆసన్నం అయింది.

దేశం లోని హిందువులందరూ, ముఖ్యంగా సోకాల్డ్ వేదపండితులూ, కాస్త వాక్శుధ్ధి వున్న వారందరూ, వాడినీ, వాడి అనుచరులనీ--ఇంకో యేడు జన్మలెత్తినా యే పదవీ లభించకుండా, జైళ్లలో మగ్గిపోయేలా శపించవలసిన సమయం ఆసన్నం అయింది.

శ్రీగిరి, శ్రీపతులూ, ఆ చుట్టుప్రక్కల హిందూ సంఘాలన్నీ వాడు మరోసారి కొండ యెక్కడానికి ప్రయత్నిస్తే కాళ్లు విరగ్గొడతామని ప్రకటించవలసిన సమయం ఆసన్నం అయింది.

మూర్ఖంగా ఆ ప్రయత్నం చేస్తే, మైకుల్లో ఆ విషయం ప్రచారం చేసి, అందరూ వాళ్లని అడ్డుకొనే ప్రయత్నం చేయవలసిన, ప్రభుత్వం వారు అవసరమైతే పోలీసు బలగాన్ని వుపయోగించి, కాల్పులు జరిపించైనా, వాణ్ని అడ్డుకోవలసిన సమయం ఆసన్నం అయింది.

ఓ ఏటీఎం దగ్గర సెల్ ఫోన్లో మాట్లాడుతూ లోపలికి వెళ్లబోయినవాడిని, అక్కడ వున్న గార్డు, అలా వెళ్తే మిషన్‌ పనిచెయ్యకపోడానికి ఆస్కారం వుంది అని చెప్పబోతే, నేను యెవరినో తెలుసా? జగన్‌.......అన్నాడంటే, వాళ్లలో కొవ్వు యెంతగా పేరుకుపోయిందో తెలియడం లేదూ?

రేపు రాబోయే యెన్నికల్లో వాడూ, ఆపార్టీ వాళ్లూ ఓటడగడానికి వస్తే, ముఖమ్మీదే వాళ్లని నిలదియ్యవలసిన సమయం ఆసన్నం అయింది......

హిందూ ప్రజలారా! మేలుకోండి!

4 comments:

Anonymous said...

who want to mess with Jagan, if he became CM by chance( 70% probable) all need to bend their heads before them. Only GOD him self can cure such issues.

TVS SASTRY said...

సోనియా ,రాహుల్ లను ఎప్పుడూ declarations అడగలేదెవ్వరు!కనీసం పవిత్రమైన దేవాలయాలన్నిటినన్నా స్వంతత్ర ప్రతిపత్తిగల సంస్థలకు అప్పగించి,ప్రభుత్వాలు వాటి నిర్వహణలో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది!

A K Sastry said...

Anonymous above!

The time has come to reduce that so called probable chance to zero.

That's what I am requesting the Hindu people to do.

So......try & don't be a pessimist.

Thank you.

A K Sastry said...

డియర్ శాస్త్రిగారూ!

ఇందిరాగాంధీని గురవాయూరు గుళ్లోకి వెళ్లనివ్వలేదు కదా? మన తి తి దే వాళ్లకి యేమి పోయే కాలం అనే నా బాధ.

మీ సూచన ఆచరిస్తే అంతకంటే కావలసిందేమి వుంది!

ధన్యవాదాలు.