Wednesday, August 5, 2015

పత్రికలూ....కధనాలూ...

"జనం కంట...ఉల్లి మంట"

మొన్ననే నా "శాకాంబరాలూ....." టపాలో వ్రాశాను పేపర్లో కథనాల గురించి. 

ఇదిగో.....నిన్న (04-08-15) మా జిల్లా ఈనాడులో పై శీర్షికతో కథనం ప్రత్యక్షం!

దీంట్లో విచిత్రాలు గమనించండి.....!

".....కారణం మహారాష్ట్రలో కురిసిన వడగళ్ల వాన కారణంగా పంట చాలావరకూ దెబ్బతినడమే....." (వడగళ్ల వల్ల భూమిలో వుండే ఉల్లికి నష్టం వస్తుందా? వరదలైతే, నీళ్లు నిలబడిపోయి, పాయలు కుళ్లిపోతాయనుకోవచ్చు! పోనీ కోశాక అయినా విపరీత వర్షాలు వస్తే, సరుకు తడిసిపోయి పాడయిందనొచ్చు!)

"....ఈ వారం లో మరింత పెరిగే అవకాశాలున్నాయి అని వ్యాపార వర్గాలు అంటున్నాయి....."

"....హుబ్లీ, బెంగళూరు ప్రాంత ఉల్లి....తయారు కాలేదు....ఇంకా 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది...."

(బెంగుళూరు "నగరం" ఉల్లిపంటకి ప్రసిధ్ధి అని వీరి కథనం. ఇప్పటికే ప్రతి రోజూ వర్షాలు కురుస్తున్నాయి కర్ణాటక అంతా. వచ్చే రెండు నెలలూ విపరీత వర్షాలు కురుస్తాయి! మరి అప్పటికి ఉల్లి పంట పూర్తిగా యెలా తయారు అవుతుందో?)

ఇంకా విచిత్రం--వీడెవడో కాంగ్రెస్ అభిమాని అయ్యుంటాడు-- 

"......ఏడేళ్ల కాలంగా ఉల్లి ధరను పరిశీలిస్తే, కిలో రూ. 6 ల నుంచి రూ. 7 ల మధ్యే వుండేది. అనంతరం ఏడాది కాలం లో ఇంతవరకు రూ. 12 లు తగ్గిన సందర్భం లేదు."

(వీడి "పరిశీలన" కి ఆధారాలేమిటో? గత యేడేళ్లుగా ఉల్లిపాయల మీద వచ్చిన కార్టూన్లు పరిశీలించినా, ఓ నాలుగేళ్ల క్రితం కిలో 120 దాకా యెగబడిందనీ, కేజ్రీవాల్ నెగ్గే ముందు కూడా 70 నుంచి 80 ఢిల్లీలోనే అమ్మిందనీ, గత సంవత్సరం, ముందు చూపుతో గవర్నమెంట్ దిగుమతులు చేసుకోబట్టి, కిలో 10 నుంచి 12 కే కట్టుబడి వుంది అనీ, పాత పేపర్లు తిరగేసినా స్పష్టం అయ్యేది వాడికి!)

ఇలాంటివండీ మన పేపర్ల పరిశీలనాత్మక కథనాలు!

No comments: