Monday, February 23, 2009

పరాకాష్ఠ!

తిమ్మనగారు పారిజాతాపహరణం వ్రాస్తూ, దాన్ని భువనవిజయం లో యెప్పటికప్పుడు చదివి వినిపిస్తూ వుండేవాడు. ఈ లోగా ఒక రోజు, రాజుగారు రాత్రి బాగా ప్రొద్దు పోయాక శయనమందిరానికి వెళ్ళి, అప్పటికే రాణి మంచి నిద్రలో వుండడంవల్ల, (బహుశా ఆయన పాన మత్తుడుకూడా అయి వున్నందువల్ల) రాణి గారి కాళ్ళ దగ్గర కాస్త చోటుంటే, అక్కడ పడుక్కున్నాడట! ఓ రాత్రివేళ, రాణీగారు వొత్తిగిల్లినప్పుడు, ఆమె కాలు రాజుగారి తలకి తగిలిందట.రాజుగారికి కూడా ఆ తగలడం తెలిసింది! యెంత రాణీ గారైతే మాత్రం, యెంతైనా మహారాజు కదా, తలమీద తన్నితే అహం దెబ్బతినదూ! అప్పటినుంచీ రాజుగారు తన ముద్దుల రాణీ పట్ల వుదాసీనంగా వుంటున్నారట! ఈ అవైనాన్ని పసిగట్టి, మన అరణపు కవిగారు షెర్లాక్ హోం స్ లెవెల్లో కూపీల్లాగి, కారణం తెలుసుకొని, పారిజాతాపహరణం లో పరమాత్ముడికీ, సత్యకీ ‘ఆ సీను’ ప్రవేశ పెట్టారుట! నిజంగా ఆ సన్నివేశం—పరమాత్ముడు సత్య కాలొత్తుతూ, ‘నీ కాలికేం దెబ్బ తగల్లేదుగా?’ అని అనునయించడం—అబ్బ! శృంగారానికి పరాకాష్ఠ కాదూ! ఆ సీను భువన విజయం లో చదవగానే, రాయలవారి పెదాలపై దరహాసం మొలిచి, హాసమై, అట్టహాసమై—ఇక……..టట్టడాం! మన అరణపుకవిగారి ఓ దీర్ఘ నిడు+ఊర్పు! (అయి పోయింది)

No comments: