Tuesday, March 15, 2011

అంథేర్ నగరీ



అన్‌భుజ్ ప్రజా

రాజకీయ నిరసనలు తెలపడం ప్రజాస్వామ్యంలో తప్పులేదు! అంటాడు కోదండరామ్.

మరేం ఫర్వాలేదు—పడగొట్టినవాటితోపాటు, కొమరం భీం, సర్వాయి పాపడు, నాయకురాలు నాగమ్మ, కడెం అప్పన్న లాంటి వాళ్ల విగ్రహాలు కూడా పెట్టేస్తాం—అంటాడింకొకడు.

వుద్యమకారులు మారణాయుధాలు ధరించి వచ్చారనడం తప్పు—అంటాడొకడు.

రెండు నెలలు ముందుగానే ప్లాను వేశాం—యెలాగైనసరే ‘ఆ విగ్రహాలు ‘ కూలగొట్టాలని!—అంటాడింకొకడు.

గొలుసులూ, రాడ్లూ, హుక్కులూ అన్నీ ముందే తెచ్చుకొన్నారు—అని వొప్పుకుంటాడింకొకడు.

350 చెక్ పోస్టులు పెట్టి యెవరూ రాకుండా చేసినా, పదిలక్షలమందీ వచ్చేశారని ఆనందిస్తాడింకొకడు.

బీజేపీ వాళ్లు పూనుకున్నారు—తెరాస వాళ్లెవరూ లేరు అంటాడింకొకడు.

విద్యార్థులనీ, ఆ వెనక్కాల లాయర్లనీ చూసి కడుపునిండిపోయింది అంటాడింకొకడు.

రొచ్చుగుంట యేర్పడబోతోంది—కేసీఆర్, కోదండరాం యేర్పాటు చేస్తారట—చేపలు పట్టేద్దాం అని బీజేపీ వాళ్లు యెప్పుడో సిధ్ధమయ్యారు అంటాడు ఇంకొకడు.

కాంగ్రెస్ వాడు లోపాయకారీగా వీళ్లని అక్కడికి చేరుకోనిచ్చాడు అంటాడు ఇంకొకడు.

కేకే, యాష్కీ లకి భలే దేహశుధ్ధి చేసేశారు, ఇంకెవరూ దొరకలేదు అని అనందంతో వాపోతాడింకొకడు.

తి సు రా రె, లగడపాటి వగైరాలు, బొచ్చెలూ, రఘువీరలూ యేమంటున్నరో తెలీదు. 4 మిలియన్ మార్చ్ యేమైనా ప్లాన్ చేసి, హైదరాబాద్ టేంక్ బండ్ నేకాకుండా, మిగతా కూడా సర్వనాశనం చేద్దామని ఆలోచిస్తున్నారేమో తెలియదు.

అసలు కేసీఆర్ కి అసెంబ్లీ, సచివాలయాలనీ, కేటీఆర్ కి టేంక్ బండ్, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం వగైరాలనీ, కవితకి గోల్కొండకోట, కుతుబ్షాహీ సమాధులు, స్థానిక హోటళ్లూ, కోదండరాం కి యూనివర్సిటీలూ, కాలేజీలూ, లాయర్లకి కోర్టులూ—ఇలా రాసిచ్చేస్తే యే గొడవా వుండకపోనుకదా అంటాడింకో అమాయకుడు.

ఇలా యెన్నాళ్లు, పదండి సోనియా దగ్గరకి—అంటాడింకొకడు.

గన్ లోడ్ చేసి పెట్టాను—పైనుంచి పేల్చమని ఆర్డరు రావడమే తరవాయి—అంటాడు గవర్నరు.

మరేం ఫర్వాలేదు, మరోసారి అఖిలపక్షం అయ్యాక, యేకాభిప్రాయం వచ్చాక, అప్పుడు శ్రీకృష్ణ కమిటీ మీద నిర్ణయం చెయ్యచ్చు అని చిదంబరం.

విగ్రహాలు నిషేధించాలి, టేంక్ బండ్ తో పాటు అన్ని విగ్రహాలూ పడగొట్టేసి, హైదరాబాదుతోపాటు అన్ని చోట్లా, అన్ని విగ్రహాలనీ పడగొట్టెయ్యండి—తరవాత యెవరెవరికి యేయే రాష్ట్రం కావాలో పంచిపెట్టడానికి ఆలోచించచ్చు అని కొంతమందీ.

పోలీసులు చక్కటి ‘సమన్వయం’ పాటించారు, ఆందోళనకారులు చక్కటి ‘సం యమనం’ పాటించారు అని వొకడూ.

అరెస్టు చేసిన వాళ్లమీద క్రిమినల్ కేసులు పెట్టేస్తున్నారు—ఇదేమి ప్రజాస్వామ్యం? అని ఇంకోడూ.

ఇలా ఇలా అనేక గొంతులు వినిపిస్తున్నాయి నిద్ర లేచేటప్పటికి.

నేను ప్రస్తుతం వున్న ప్రదేశం లో ప్రజలు—హైదరాబాద్ నించి వచ్చారా? ఎన్‌టీఆర్ వుండేవాడుటకదా అక్కడ? స్వీట్లు యెక్కువ తింటారటకదా అక్కడ? బిరియానీ బాగుంటుందటకదా?—ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు తప్పితే, “తెలంగాణా, కేసీఆర్, కిరణ్ కుమార్"—లాంటి మాటలే వీళ్లకి తెలియదు!

సముద్రంలో కాకిరెట్ట మన ఆంధ్ర! దాన్ని యెన్ని ముక్కలు చేస్తే యెలావుంటుందో వూహించుకోండి.

సజీవ ముఖ చిత్రం చూడండి! తరవాత ఆలోచిద్దాం!

4 comments:

Unknown said...

EdsinaTTE vuMdi!

Anonymous said...

well said sir.

A K Sastry said...

డియర్ sami!

వొప్పుకున్నారుగా!సంతోషం.

ధన్యవాదాలు.

A K Sastry said...

పై అన్నొన్!

సంతోషం.

ధన్యవాదాలు.