Friday, February 20, 2009

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

పరాకాష్ఠ!
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారని, మన ఆంధ్ర ప్రదేశ్ ఆస్థాన కవిగా కొన్నేళ్ళు వున్నారు. తెలుగు సాహిత్యాన్ని ఔపోశన పట్టిన వాళ్ళల్లో ఆయన అగ్రగణ్యుడు! ఆయన ‘అనుభవాలూ, జ్ఞ్యాపకాలూను ’ చదివితే, ఆ రోజుల్లో, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పరిస్థితులు కళ్ళకు కడతాయి! ఇక ఆయన చిన్న కధలకి వస్తే, ‘వడ్లగింజలు’ ఈ నాటికీ, యేనాటికీ, ఓ మిస్టరీ! మన కంప్యూటర్లు లెక్క కట్టవలసిన దాన్ని, ఆయన అప్పుడే చెప్పారు! శ్రీ కృష్ణ దేవరాయలుకి తన ముద్దుల భార్యతో అరణపు కవిగా వచ్చాడుట—నంది తిమ్మన—అదే—‘నానా సూన వితాన…….’ అంటూ ముక్కు మీద పద్యం చెప్పిన మన ‘ముక్కు తిమ్మన’! ఆయన బాధ్యత—అప్పటి రాజకీయ పరిస్థితులనిబట్టి, అమ్మాయికి యే కష్టం కలుగకుండా, మొగుడితో కాపురం చేసుకునేలా చూసుకోవడం. అంతే! దానికి ఆయన యెంత కష్ట పడ్డాడు! అమూల్యమైన ‘పారిజాతాపహరణం’ కావ్యాన్నే వ్రాశాడు! అది యెలా అన్నది శ్రీ శాస్త్రి గారి చిన్న కధల్లో చదవండి! (ఇంకా వుంది)

2 comments:

మురళి said...

శాస్త్రిగారి 'గులాబి అత్తరు' కూడా మంచి కథ.. ఆసక్తికరమైన సమాచారం..

A K Sastry said...

డియర్ మురళి!

చాలా మంచి కధల గురించి అందుకే ప్రస్తావించాను.

ధన్యవాదాలు!