Sunday, January 9, 2011

కాంగీల నిర్వాకం

ద్రవ్యోల్బణం

గత డిసెంబరు నెలాఖరుకల్లా 7 శాతానికీ, ఈ మార్చి కి 6-6.5 శాతానికి "ద్రవ్యోల్బణం" దిగి వస్తుందని రంగరాజన్ ప్రకటన వెలువడి ఇంకా మూడు రోజులు కాలేదు!

నవంబరులో 7.75 శాతం గా నమోదైన ద్రవ్యోల్బణం, ఆయన చెప్పినట్టే దిగి వస్తుందనుకోడానికి--నవంబరు 27 న 8.69 శాతం గా వున్న "ఆహార ద్రవ్యోల్బణమే", డిసెంబరు 18 నాటికి 14.44 శాతానికీ, 25-12-2010 నాటికి 18.32 శాతానికే చేరిందే!!!!

పాత ఆర్థిక మంత్రీ, తమిళ నారదుడూ చిదంబరం (ఆమాటంటే వాడొప్పుకోడు--వాడి దృష్టిలో నారదుడు ఆర్యుడు!) 'ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలన్నీ తీసుకొంటోందా?' అని అనుమానం వస్తోంది అంటున్నాడు.

వుల్లిపాయనించీ, కారు వరకూ అన్నిటి ధరలూ పెరిగాయి! (ఇదంతా ఇంకా డీజిల్ ధరలు పెంచకుండానే!)

'రాష్ట్ర ప్రభుత్వాలూ! సరైన చర్యలు తీసుకోండి. స్థానిక పన్నుల్ని రద్దుచెయ్యండి. అక్రమనిల్వదారుల భరతం పట్టండి' అంటూ గర్జిస్తోంది వృధ్ధ సిం హం ప్రణబ్!

మోర్ లూ, మాగ్నాలూ, స్పెన్సర్లూ వగైరాలు--రేట్లు తక్కువగా వున్నప్పుడు కొనేసి, నిలవ చేసుకొని, ఇప్పుడు రేట్లు 'భారీగా' పెరిగాక, 'బారీ' డిస్కవుంట్లతో అమ్మేసుకొంటూ, 'ఫ్యూచర్లూ' వగైరాలలో ఇంకో మూడు నెలల వరకూ రేట్లు పెరుగుతూనే వుండేలా 'ఆప్షన్లు' పెడుతున్న వాళ్లని 'వృధ్ధ సిం హం' యేమైనా చెయ్యగలదా? అని అడగకండి మరి! 

ఇంకో ప్రక్క స్టాక్ మార్కెట్ పడిపోయి, విదేశీ పెట్టుబదులు వెనక్కి వెళ్లిపోతే, రూపాయి బలహీనపడి, ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది!

"నీ గుడ్లు అన్నీ ఒకే బుట్టలో పెట్టుకోవద్దు" అని ముసలి ఆంగ్లేయులు చెప్పేవారట! అదికూడా తెలియదు మన కాంగీలకి. పాకిస్థాన్ నుంచి రోజుకి 300 టన్నుల చొప్పున దిగుమతి అవుతున్న 'వుల్లిపాయల ' ని నిషేధించిందట 06-01-2010 న పాకిస్థాన్ హఠాత్తుగా! అందుకనే ధరలు పెరుగుతున్నాయనీ, వాళ్లతో మాట్లాడుతున్నామనీ, వాఘా బోర్డరు దగ్గర ఆగిపోయిన దాదాపు 300 లారీల (యెన్ని టన్నులో?) వుల్లిపాయలూ త్వరలో వస్తాయనీ, ఆశాభావం వ్యక్తం చేశారట--అమాత్యులు ఎస్ ఎం కృష్ణ! (దానికి ప్రత్యామ్నాయంగా కసబ్ నే ఇచ్చేస్తారో, కాశ్మీర్నే ఇచ్చేస్తారో మరి!)

అదివరకు "ప్రభుత్వం దగ్గర నిధులు పేరుకుపోయాయి.....అందుకే ద్రవ్య లభ్యత 'కఠినంగా' మారింది" అన్న ఆర్బీఐ మాటపై, ప్రభుత్వం కొన్ని బ్యాంకులకి 5000 కోట్లకి పైగా 'అదనపు మూలధనం'గా ఇచ్చీ, తన వ్యయాన్ని బాగా పెంచీ, ఈ త్రైమాసికం లో ద్రవ్య లభ్యతని పెంచుతోంది! 

ఇంకో ప్రక్క, బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లు అప్పుడో పది పైసలూ, అప్పుడో పావలా పెంచుతూ, అసలు వడ్డీ యేమీ ఇవ్వకుండా ప్రజలని మోసం చేస్తూ, దండుకుంటూనే వున్నాయి. అది కాకుండా, అన్ని బ్యాంకులూ కలిసి, రోజూ 1,50,000 నించీ 1,60,000 కోట్లవరకూ రిజర్వ్ బ్యాంకు నించి రివర్స్ రెపో మీద తీసుకుంటున్నాయి! 

మరి ఈ డబ్బంతా యెక్కడికి పోతూంది?   

ఇంకెక్కడికి--మన మార్కెట్లలోకే! ఆ డబ్బులో వుత్పాదక రంగానికి పోతున్నదెంత? అందుకే ద్రవ్యోల్బణం!

అసలు మన ఆర్బీఐ, నాటకాలాడకుండా, ఒకేసారి ఓ రెండు శాతమో యెంతో అన్ని రేట్లనీ పెంచేసి, వ్యవస్థకి ఓ షాక్ ఇస్తే, పదిహేనురోజుల్లో అన్నీ చక్కబడవూ?

"......ఖుదరదు!" అంటారు మన కాంగీలు!

అయినా, సోనియా దగ్గరనించీ, మన్మోహన్ దగ్గరనించీ, మంత్రుల దగ్గరనించీ, ముఖ్యమంత్రుల దగ్గరనించీ, ఇతర మంత్రులవరకూ, "మా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పాం!" అంటారేమిటో? 

మీకేమైనా అర్థం అవుతోందా?

No comments: