Friday, April 1, 2011

పథకాలూ



చెవిలో పువ్వులూ

ఎన్ తులసి రెడ్డి--కోతిక్కొబ్బరకాయ దొరికినట్టు ఈయనకో పదవిచ్చారు--20 సూత్రాల కార్యక్రమం అమలు అదేదో చైర్మన్ ట. ఆ ఇరవై సూత్రాల్లో కనీసం ఓ పదైనా వరసగా వెంటనే చెప్పమనండి ఈ కాంగ్రెస్పండితుణ్ణి!

"మునెపెప్పుడో పడవల్లో ప్రయాణం చేసే రోజుల్లో......" అన్నట్టు, 1975 లో "గరీబీ హటావో" నినాదం తో యెన్నికలకు వెళుతూ ఇందిరాగాంధీ ప్రకటించింది ఈ 20 సూత్రాలనీ. నిజానికి గరీబీ హటావో అన్నది అప్పటి రక్షణ మంత్రో, హోం మంత్రో (ఇందిర కుడి భుజమో యేదో) అయిన బాబూ జగజ్జీవన్ రామ్ ఇచ్చిన నినాదం. అది పార్టీ నినాదంగా మారి, ఇందిర పేరున స్థిరపడిపోయింది.

తరవాత సంజయ్ గాంధీ ఆ 20 నీ భ్రష్టు పట్టించడంతో, సవరించబడ్డ (రివైజ్డ్) 20; మళ్లీ ఇందిర అధికారం లోకి వచ్చాక "క్రొత్త" (న్యూ) 20; ఇంకా తరవాత "నూతనీకరించబడ్డ" (మాడిఫైడ్) 20--ఇలా ఆ పరంపర కొనసాగుతూ వచ్చింది. ఫలితం మాత్రం హళ్లికి హళ్లి. కానీ ఈ పథకాల పేరుతో ప్రభుత్వ/అధికారుల కార్యక్రమాలూ, సమీక్షలూ, చర్యలూ, ప్రోత్సాహకాలూ వగైరాలకీ, బ్యాంకులు పంచిపెట్టి వసూలు చేసుకోలేకపోయిన ఋణాలకీ, వాటిమీద ప్రభుత్వానికి సమర్పించవలసిన/సమర్పించిన నివేదికలకీ, కొన్ని వేల కోట్లు హారతి కర్పూరమయ్యాయి!

అప్పటినించీ, కాంగ్రెస్ ప్రథానులూ, మన రాష్త్ర కాంగ్రెస్ ముఖ్య మంత్రులూ ఆ 20 భజన చేస్తూనే వున్నారు--కిరణ్ కుమార్రెడ్డి తో సహా. 

పోనీలెండి--తులసి కూడా, తనవంతు కృషి (ఖర్చు) చేస్తున్నాడు ఇంట్లో కూర్చొని గోళ్లు గిల్లుకోకుండా (అసమ్మతిలోజేరి దాన్ని యెగదోయకుండా!). 

ఇందిరకీ, ఆ 20 కీ జై!

No comments: