Friday, September 2, 2011

వుద్యమ.....



.....క్షేత్రాలు

అన్నా దీక్ష సఫలం తరవాత యేమిటి?
లోక్ పాల్ తరవాత 'జీవితం 'యేమిటి?
ఇంకా వుద్యమాల అవసరం వుందా?
వుద్యమాలని రాజకీయ పార్టీలతో అనుసంధానం చెయ్యాలా?

ఇలా అనేక ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. 

పుణ్య క్షేత్రాల్లో "పూల మాఫియా"; "ట్రావెల్ మాఫియా"; "హోటెల్ మాఫియా"--ఇలా వాపోతోందో ఛానల్.

నన్నడిగితే, లోక్ పాల్ కన్నా ముందు ఈ "క్షేత్ర నిర్వహణ" లకి వ్యతిరేకంగా చెయ్యాలంటాను--వుద్యమాలని.

(వాళ్లు 'మా క్షేత్రం--మా యిష్టం' అంటారేమో!)

మా చిన్నప్పుడు పుణ్యక్షేత్రాలంటే, తిరుపతి, కాళహస్తి, శ్రీశైలం, కంచి, మధుర, రామేశ్వరం--ఇలా చెప్పేవారు.

తరువాత, తి తి దే వారు తిరుచానూరుని వృధ్ధి చేశారు. 1970లలో అయ్యప్ప చేరాడు. తరువాత షిరిడీ. ఈమధ్య కాణిపాకం చేరింది. ఇంకా చాలా చేరుతున్నాయి.

అన్నట్టు, రాజుగారు టిఫిన్ డబ్బాల్లో పెట్టుకొని, నగలు యెత్తుకుపోతుంటే, ఓ వుద్యోగి చూశాడు అనీ, అందుకే ఆ వుద్యోగిని తొలగించారు అనీ, ఆరోపించాడు అచ్యుతానందన్.

అక్కడి వాడుక యేమిటంటే, రాజుగారు గుడి బయటికి వచ్చేముందు, కాళ్లకంటిన ఇసుక రేణువులని కూడా శుభ్రంగా దులిపేసుకొని బయటికి వాస్తాడు అని!

నిజానిజాలు అనంత పద్మనాభుడికే తెలియాలి మరి!

యేమంటారు?

No comments: