Tuesday, January 4, 2011

కాంగీ పార్టీ - 2

పచ్చి నిజాల గురించి నా వ్యాఖ్యలు :

1. ఇన్నాళ్లకి కాంగీ పార్టీ వొప్పుకున్న పచ్చినిజాలు. ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యం ముసుగులో పచ్చి నియంత అయ్యారు. తనకి కిట్టని రాజకీయ నాయకులందర్నీ జైళ్లలో మ్రగ్గించారు. వాళ్లని కోర్టులలో హాజరు పరచడం మొదలైనవి దాదాపు లేవు. ప్రాథమిక హక్కులని అధికారికంగా సస్పెండు చేశారు!

పత్రికలకి 'సెన్సార్ షిప్' విధించారు. ఇది అమల్లోకి వచ్చిన కొత్తలో, పత్రికల్లో సంపాదకీయం, ముఖ్య వ్యాసాలూ ప్రచురణ ఆపేస్తే, పత్రికల్లో ఆ స్థానాలు ఖాళీగా తెల్లగా ప్రచురించి, 'సెన్సారు చెయ్యబడింది' అని వ్రాసేవారు. తరవాత, అలా కూడా వ్రాయకూడదు అని నిర్బంధించి, యేదో వొకటి ఆ స్థానం లో వ్రాయాలి అని నిర్బంధించి, నెగ్గించుకొన్నారు!

న్యాయ వ్యవస్థ అధికారగణం చెప్పినట్టు వినాల్సిందే!

(ఇంకా వివరాలు యెవరైనా అడిగితే వ్రాస్తాను.)

2. నిజమే.....తిరుగులేని యువ నేతగా యెదిగాడు సంజయ్ గాంధీ. అప్పటికి ఓ గమ్యం లేకుండా భ్రష్టుపడుతున్న యువతకి--ఓ కార్యక్రమం ఇచ్చి, దిశా నిర్దేశం చేసి, యువ శక్తిని ఓ సరైన మార్గంలోకి ప్రవేశపెట్టాడు. నక్సల్స్ లో చేరాలనుకొంటున్న మా కజిన్ సిస్టర్ తో సహా, నా స్నేహితులనేకమందినీ, అలాంటి యువత చాలా మందినీ, యూత్ కాంగ్రెస్ లో చేరేలా చేశాడు.

(మన రఘురామయ్యలు వాడి చెప్పులు మొయ్యడం, జయసుధ వాడితో 1స్ట్ క్లాస్ లో ప్రయాణించడం లాంటివి ప్రక్కన పెడితే) ముఖ్యంగా ఢిల్లీ, యూపీ, బీహార్, హర్యాణా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లొ, మూర్ఖ హిందువుల్నీ, నలుగురేసి పెళ్లాల్తో, డజన్లకొద్దీ పిల్లలని కన్నవాళ్లనీ, 'నిర్బంధ కుటుంబ నియంత్రణ శిబిరాలకి' తరలించాడు!

వాడు అర్థాంతరంగా చనిపోకుండా వుంటే, దేశానికి ఇంత దరిద్రం వుండకపోను--శిలా న్యాస్ లూ, బుజ్జగింపులూ, వోట్ బ్యాంకులూ వుండకపోవును! ఇంత జనాభా పెరుగుదలా, ఇన్ని స్కాములూ వుండకపోవును! (వాడి దెబ్బతోనే కుటుంబ నియంత్రణ శాఖని--కుటుంబ సంక్షేమ శాఖ గా మార్చేశారు!)

'నిర్హేతుక, నిరంకుశ' అన్నది తరవాత కాంగీ వాళ్లే--వాళ్లే రాజీవ్ గాంధీ కోటరీ!

మిగతా మరోసారి.