Thursday, September 29, 2011

డ్రామా....హై డ్రామా....హై హై డ్రామా! -- 6



విచారణలు

నాకో విషయం నవ్వొస్తూ వుంటుంది. గత నాలుగైదేళ్లుగా, ఈమెయిల్ వ్రాశాక ఓ తోక తగిలించడం ఓ ఫేషన్ అయిపోయింది--"అత్యవసరమైతేనే దీన్ని ప్రింటు తీసుకోండి--పర్యావరణాన్ని రక్షించండి" అనో యేదో! ఆహా! పర్యావరణమ్మీద హెంత మమకారం! అనుకోవాలి ఆ మెయిల్ చదివినవాళ్లు. 

తీరా చూస్తే, కంప్యూటర్లు వచ్చాక వాటికి సంబంధించిన చెత్త పెరిగిపోవడం సంగతి అటుంచి, రీములకి రీములు పేపరు వేస్ట్ అయిపోతూంది--యే ఆఫీసులో చూసినా! 

ఇంక ప్రభుత్వం చూస్తే, యెంత పేపరు దండగ అవుతూందో అంచనాలకి అందదు! 

వుదాహరణకి, "గాలి"కి బెయిలు ఇవ్వాలా వద్దా అనే అంశంపై సీబీఐ కోర్టులో ఓ వారం పైగా వాద ప్రతివాదనలు జరిగాయి అని విన్నాం. కోర్టుల్లో, న్యాయవాదులూ, జడ్జీలూ, ముద్దాయిలూ, సాక్షులూ యెవరేమి మాట్లాడినా, అవి రికార్డు చెయ్యబడతాయి. బెంచి క్లర్క్ కమ్ టైపిస్ట్ వెంట వెంటనే టైపు చేసేసి, రికార్డు చేసేసేవారు. ఇప్పుడు కంప్యూటర్లలో చేస్తున్నారేమో చాలా చోట్ల. మరి న్యాయవాదులు ప్రతీరోజూ చేసే వాదనలు యేరోజుకారోజు రికార్డు చెయ్యబడి, వాటిని సరిపోయినన్ని ప్రింట్లు తీసి, వలసినవారందరికీ అందజేస్తారు. అలా యెన్ని కాపీలు తీస్తారో వూహించుకోండి. 

ఇంక పాడిందే పాటరా అంటూ వారం రోజులపాటు, ప్రతీ రోజూ జరిగిన వాదనలని యెన్ని పేజీల, యెన్ని కాపీల ప్రింట్లు తీశారో వూహించుకోండి! 

వాదనలు ముగిసాక, తీర్పు.....వాదనల్లోని సారాంశాన్ని యథాతథంగా వుటంకిస్తూ, కొన్ని వందల పేజీలు వెలువరిస్తారు. మళ్లీ ఆ తీర్పుకి వలసినన్ని కాపీలు తియ్యలి. యెన్ని పేజీలు అవుతాయో వూహించండి!

ఇంకో వుదాహరణకొస్తే, సీబీఐ వారు విజయసాయిరెడ్డిని, దిల్ ఖుషా అతిథిగృహాన్ని తమ కార్యస్థానం చేసుకున్న రోజు నుంచీ, ప్రతీరోజూ వుదయం 9 నుంచి సాయంత్రం వరకూ, 23 రోజులుగా ప్రశ్నిస్తూనే వున్నారు అని చదివాము. ఇప్పటికి అది 30 రోజులు దాటిందేమో! 

ఆ ప్రశ్నించే విధానం యెలా వుంటుందంటే, ముందు ప్రమాణం తో మొదలవుతుంది. అక్కడనుంచి, ఓ ప్రశ్న అడగడం, దానికి ఆయన సమాధానం చెప్పడం, ఇవన్నీ తెల్లకాయితాలమీద 'రఫ్' గా రికార్డు చేస్తారు. ఆ రోజుకి పూర్తి కాగానే, అప్పటివరకూ తయారైన ప్రశ్న సమాధానాలని 'ఫెయిర్' గా తయారు చేసి, ప్రతీ పేజీమీదా ఆయన సంతకాలు తీసుకొంటారు! 

మధ్య మధ్యలో యే సిగరెట్టు కాల్చడానికో, పానో, బిస్కెట్లూ టీలకో కాస్త విరామం ఇచ్చినప్పుడు, అప్పటివరకూ వ్రాయబడ్డ రఫ్ నోట్స్ ఫెయిర్ చెయ్యడానికి వెళ్లిపోతాయి. బ్రేక్ తరవాత మళ్లీ ఓ ఫ్రెష్ కాయితం తో సిధ్ధం. 

ఆరోజు పూర్తైన ఫెయిర్ కాపీని ప్రశ్నించబడ్డవాళ్ల సంతకాలతో, వలసినన్నీ కాపీలు జెరాక్స్ తీయిస్తారు. 

ఇంకా, యెలాగైనా కావలసిన సమాధానాన్ని రాబట్టాలని, వేలికేస్తే కాలికీ, కాలికేస్తే వేలికీ వేస్తూ, అడిగిన ప్రశ్ననే అనేకవిధాలుగా మార్చి అడుగుతూ వుంటారు! మరి వీటన్నింటికీ రోజుకి యెన్ని "రీముల" కాయితాలు ఖర్చు అవుతున్నాయో వూహించగలరా?

పేపర్లో వచ్చే, ఫలానా కేసులో న్యాయమూర్తులు 8 వేల పేజీల తీర్పు ఇచ్చారు; ఫలానా కమిటీ 7 వేల పేజీల, 9 వాల్యూముల నివేదిక సమర్పించింది.....అని చదువుతాము కదా?  మరి అన్ని పేజీల/వాల్యూముల రిపోర్టులని యెన్ని పదుల/వందల కాపీలు తీస్తారో, అవి బుట్టదాఖలా అయి, ఇంకో తీర్పో, కొత్తకమిటీనో వేస్తే.....షరా మామూలే!

ఈ మెయిల్ తరవాత తోకని చూసి, హాయిగా, మనస్పూర్తిగా నవ్వుకోవడంలేదూ?

ఈ దేశాన్నీ, పర్యావరణాన్నీ బుర్రోవాదులనుంచి పరమాత్ముడే రక్షించుగాక!

2 comments:

Anonymous said...

(Name is immaterial, I think and sorry for not writing in Telugu directly).

Understood your points and thanks for letting me read. However, I would appreciate some constructive ideas to prevent / lessen the waste. More discussion is welcome on those lines rather than highlighting only on the amount of waste. My 2 cents:

Keep it electronic and let the needy (only) print and read or read on monitor directly.

Send e-mails and ask them to store in cloud / HDD rather than in CD (again 'solid' waste!).

Just videograph the entire session (no writing) and at least complete audio and important (to be decided by judge / experts) sessions video.

P.S. I am not a lawyer and hence don't know how much of the above is possible, per the existing law and what are the steps to consider to include some of these points in future law. Our other learned readers might throw more light on these aspects as well.

Thanks once again. Sincerely,

A K Sastry said...

పై అన్నోన్!

మీ సూచనలు బాగున్నాయి కానీ ఆచరణ సాధ్యం కాదంటారు పెద్దలు. యెందుకంటే, వాటికోసం చాలా చట్టాలూ వగైరాలు మార్చాలి.

పిల్లి మెడలో గంట యెవరు కడతారు?

మీరన్నట్టు మేధావులు చెప్పవలసిందే!